నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, July 15, 2010

గాంధీ బతికుంటే ఎన్ కౌంటరైపోయుండేవాడు

మహాత్మా గాంధీ ఈనాడు బతికి ఉంటే సెజ్ ల పేరిట అభివృద్ధి పేరిట అమాయకులను నిర్వాసితులని చేయడం, సారవంతమైన భూమిని రైతుల దగ్గర లాక్కొని బడా కంపెనీలకి అప్పగించడం చుస్తూ ఊరికే ఉండే వాడా? ఒంట్లో ఓపిక లేకపోయినా ఏదో విధంగా లేచి ముందుండి ప్రజల ఆందోళనకి నాయకత్వం వహించే వాడు కదా?అయితే నాటి ఆంగ్లేయ ప్రభుత్వం లాగా మన ప్రభుత్వం ఆ ముసలాయన చేసే అహింసాయుత పోరాటానికి భయపడుతుందా?
ఓ వెయ్యో, రెండు వేలో ధృడ సంకల్పం తప్ప మరొక ఆయుధం లేని జనాన్ని వెంటేసుకొని పిడికెడు ఉప్పు చేతిలోకి తీసుకోగానే ఆ ముసలాయన్ని చూసి నాటి రవి అస్తమించని ఆంగ్లేయ ప్రభుత్వం వణికిపోయింది. ఆయన నిరాహార దీక్శ చేసిన ప్రతి సారీ నాటి ప్రభుత్వం దిగి వచ్చింది.
అదే అహింస, సత్యాగ్రహం ఆయుధాలుగా ఆయన ఈనాడు పోరాటం చేస్తే ఏమౌతుంది?

ఒకానొక రాత్రి పోలీసులు ఆయన ఆశ్రమం పైన దాడి చేసి ఆయన్ని, ఆయన అనుచరులను గుట్టు చప్పుడు కాకుండా జీపుల్లో తీసుకెళ్ళి ఏ అడవిలోనో కాల్చిపారేసి, చేతిలో తుపాకులూ, పక్కన విప్లవ సాహిత్యమూ పెట్టి, పోలీసుల పైకి ముందు వాళ్ళే కాల్పులు జరిపారనీ, ఎదురు కాల్పుల్లో మరణించారనీ ఒక కథ చెప్పేవాళ్ళు.
ఏదో ఆంగ్లేయులు కాబట్టీ, వాళ్ళకీ ఇన్ని విద్యలు అప్పట్లో తెలియవు కాబట్టీ పెద్దాయన చేతి కర్రతో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడు. అదే మన పాలకులైతేనా........

ఇడుపుల పాయలో పవర్ ప్లాంటు ఎందుకు పెట్టరు?

పవర్ ప్లాంటులన్నీ బలహీనుల(ఆర్ధికంగా,రాజకీయంగా) పొలాలలోనో, తోటల్లోనో మాత్రమె ఎందుకు పెడతారు, అవి సార వంతమైన భూములైనా సరే? ఏ ఇడుపుల పాయ ఎస్టేటులోనో పెట్టాలని ఎప్పుడూ, ఎవడూ ఎందుకు అనుకోడు?

ఇడుపుల పాయ మొత్తం ఒక వ్యక్తికి చెందిన ఆస్తి. ఆ వ్యక్తికి ఆ ఆస్తి మొత్తం కూడా తృణప్రాయం.అంతా పోయినా లెక్క లేనంత ఆసామీ అతను.అలాంటి చోట పవర్ ప్లాంటో ఇంకే నాశనమో పెట్టినా ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు కదా? అలా బడా బాబులకూ, మంత్రులకూ చెందిన భూములలో ఇలాంటీవి పెట్టాలన్న ప్రతిపాదన ఇప్పటివరకూ రానేలేదెందుకో?

Are we living in a democracy?

I could not log on to lekhini.org site and hence I could not transliterate this post from english script into telugu.I tried for four hours but could not open lekhini.Because of my urge to post this,I am writing this in English.

I recall reading that Abraham Lincoln had defined democracy as a government of the people,by the people, for the people.But when I saw the horrendous attack by the police on the people of Sompet, I doubt whether we are living in a democracy in spite of our claims that ours is the world's largest democracy.

When somany people do not want the power plant in their fertile lands a government that is run by the people for the people should abandon it.Isn't it?

The adamant attitude of Dharmana Prasada Rao that nothing can stop the power plant is a slap on the people and our belief that we are living in a democracy.I have never seen Sompet, but the visuals on television screen portray a fertile land with lush greenery. Isn't it a shame to sacrifice those lands at the altar of socalled development?

Why can't people's wishes can be accommodated while going ahead with agenda of development?Should development always mean tears for the common man? It is time for all of us to introspect.

Tuesday, July 13, 2010

రాష్ట్ర పిత రాజ శేఖర్ రెడ్డి!

రాజశేఖర్ రెడ్డిని గాంధీగారి పక్కన పీఠం వేసి కూర్చోపెట్టగానే తన పని అయిపోయినట్లు మళ్ళీ ఆ ఊసేమీ పట్టించుకోవడం లేదు జగన్.చేయాల్సింది చాలా ఉందయ్యా జగన్ బాబూ!

మోహన్ దాస్ గాంధీని జాతిపిత అన్నట్లుగా మన రాజశేఖరుడిని కనీసం రాష్ట్ర పిత అయినా చేయక పోతే ఎలా?ఇంక విగ్రహాల సంగతంటావా ..ఆ దిశగా నువ్వు ఇప్పటికే చాలా చేసేస్తున్నావులే.నీ ఒదార్పు యాత్ర పూర్తయ్యేలోగా మన రాష్ట్రంలో ఆ గాంధీ బొమ్మల కన్నా మీ నాన్న బొమ్మలు ఎక్కువే ఉంటాయి.అందులో రెండో మాటే లేదు.
ఆ గాంధీ పేరుతో ఊరూరా సందులూ గొందులే ఉంటే మన పేరుతో ఏకంగా ఒక జిల్లాకి జిల్లాయే ఖారారైపోయింది కదా.ఈ విషయంలో మనదే పైచేయి.
మరి యేటేటా జయంతికీ,వర్ధంతికీ సెలవులు ప్రకటించాలి.అన్ని తరగతుల సిలబస్సులో అన్ని సబ్జెక్టులలో పాఠ్యాంశంగా చేర్చాలి.ఒక అనుమానం రావచ్చు ఇక్కడ.తెలుగు,ఇంగ్లీషు,హిందీలలో జీవితాన్ని పాఠంగా పెట్టొచ్చు.మిగతా సబ్జెక్టులలో రాజశేఖర్ రెడ్డిని ఎలా ఇరికించాలా అన్న అనుమానం వద్దు.

మ్యాథ్స్ లో జలయగ్నం లెక్కలు,పాదయాత్ర లెక్కలూ పెట్టవచ్చు. సైన్సులో మళ్ళీ ఆనకట్టలూ,నీటి పారుదలా, సోషల్ స్టడీస్ లో భౌగోళిక శాస్త్రంలో మాగాణి లెక్కలు, చరిత్రలో ఆయన జీవిత గాధనే ఒక చరిత్రగా,ఆర్ధిక శాస్త్రంలో బడ్జెట్ లెక్కలూ, లక్ష రూపాయల బడ్జెత్ గురించి చెప్పొచ్చు.

ఇవన్నీ తరువాత ముందు రాష్ట్ర పిత టైటిల్ గురించి ఆలోచించు జగన్.

ఈ బ్లాగు నీకండగా నిలుస్తుంది.

Sunday, July 11, 2010

జగన్ మోహన్ రెడ్డి గాంధీ సన్నాఫ్ రాజ శేఖర్ రెడ్డి గాంధీ

జగన్ మోహన్ రెడ్డి ఒదార్పు యాత్ర ఎడతెగకుండా చేసీ చేసీ, పది నెలలుగా ఎందరో గుండెల్లో ట్యాంకులు కత్తి దాచుకున్న కన్నీటిని బయటకు తీసి మరీ తుడిచి వాళ్ళకు ఒదార్పు నిచ్చి తన కంటి నీటిని వాళ్ళ చేత తుడిపించుకొని అలసి పోయి ఒక చోట అలా నడుము వాల్చాడు కాస్సేపు విశ్రాంతి తీసుకొందామని.మాగన్నుగా నిద్ర పట్టింది.అయినా అతడి గుండెల్లో వేదన,ఆవేదన.

నెహ్రూ చనిపోతే ఇందిర,ఆమె చనిపోతే రాజీవ్,అతడు చనిపోతే సోనియా కాళ్ళ దగ్గరికి ప్రాధాని పదవి వచ్చింది.ఆమె కాదన్నాకే అది పక్కకి పోయింది.ఇప్పుడు రాహుల్ మెడ మీద పూలమాలలా పదవి వేలాడుతూ ఉంది.అతడు చిటికే వేస్తే మెడలో పడిపోదామని.అలాంటిది తన తండ్రి చనిపోతే తను కావాలి మొర్రో అన్నా ముఖ్యమంత్రి పదవి తనకు దక్కలేదు.ఇంత కన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా?

అప్పుడు"నాయనా జగన్" అన్న పిలుపు వినిపించి లేచి కూర్చున్నాడు.ఎవరూ కనిపించ లేదు.అటూ ఇటూ చూశాడు."నాయనా నేనూ ఆకాశవాణిని" అన్నదా గొంతు."ఆకాశవాణా?శాటిలైట్ చానళ్ళు వఛ్ఛాక కూడా నువ్వింకా ఉన్నావా?" అడిగాడు జగన్.

"నాయనా నేను కథల్లో వినిపించే ఆకాశ వాణిని " అన్నదా గొంతు."సరే ఏమిటో చెప్పు.నేను ఓదార్చాల్సిన లిస్టు ఇంకా చాలా ఉంది" అన్నాడు జగన్ అసహనంగా."నీ సందేహానికి సమాధానం నాకు తెలుసు.చెప్తాను విను."

"ఇందిర్తకు,రాజీవ్ కూ,సొనియాకు,రాహుల్ కూ ప్రధాని పీఠం కాళ్ళ వద్దుకు రావడానికి కారణం వాళ్ళ పేరులో ఉన్న గాంధీ నాయనా"అని చెప్పి ఆకాశవాణి మాయమయ్యింది.

జగన్ కళ్ళు తెరుచుకొన్నాయి.ఇప్పుడు వెంటనే తన పేరులో గాంధీని తగిలించుకోవాలి.అయితే ఎలా?తను గాందీ కుటుంబంలో పుట్టి ఉండాలి లేదా ఎవడైనా గాంధీ తనని దత్తత తీసుకొని వాడి తోక తనకి తగిలించాలి.రెండూ అయ్యే పనులు కావు.ఎలా అని తీవ్రంగా అలోచించాక ఒక ఆలోచన తట్టింది.గాంధీనే తన తండ్రిగా మార్చి పారేస్తే?

అందు వల్లనే రాజ శేఖర్ రెడ్డి గాంధీ లాంటివాడు అన్న స్టేట్ మెంట్ ఇచ్చాడు జగన్. యాత్ర మరో రెండు రోజులు గడిస్తే రాజ శేఖర్ రెడ్డి గాంధీ అయిపోతాడు.మహత్మా గాంధీ చనిపోయాక ఆయన ఆత్మ ఒక 18 నెలలు స్వర్గంలో గడిపి తెలుగు ప్రజలని ఉద్ధరించడానికి పులివెందులలో పుట్టింది అని ఒక స్టోరీ సాక్షి పత్రిక,చానల్ లో ఊదర గొట్టేస్తే సరి.

దీన్ని సమర్దిస్తూ అబటి రాంబాబు లాంటి చెంచా గాళ్ళు మీడియ చానళ్ళలో ప్రచారం చేస్తారు.ఎవడో వర్షాలు కురవాలని రాజశేఖర రెడ్డి గాంధీ యాగాలు చేస్తాడు.పొలాల్లో అధిక దిగుబడి కోసం ఆయన ఫోటోలు పెడతారు.అయితే దిష్టి బొమ్మలకీ వీటికీ తేడా ఉండాలి కాబట్టి ఫోటోలు పొలమలో చిన్న మందిరం కట్టి అందులో ఉంచుతారు.ఈలోగా ఇంకెవడో రాజశేఖర మాల అని మొదలు పెడతాడు.ఆయన లాగా పంచె కట్టి మూడు వారాలు ఆయన ఫోటొకి పూజ చేసి కాలి నడకన ఇడుపుల పాయ చేరుకొని మాల తీసేస్తారు.

వెదజల్లడానికి డబ్బు ఉండాలి కానీ వెర్రి వెధవలకి ఏమి తక్కువ?ఇదంతా తిక్క వ్యవహారం అని ఎవరైనా కొచెం ఆలోచించే సన్నాసులకి అనిపిస్తే వాళ్ళు ఎలాగూ బయటకి రారు కాబట్తి అసలు గొడవ ఉండదు.

Friday, July 9, 2010

ఇదేం ఓదార్పు జగన్ బాబూ?

ఓదార్పు యాత్ర గురించి జగన్ గానీ అతడి శిబిరం గానీ చెప్పే మాటలు రెండు ఉన్నాయి.ఒకటి హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే వారి ఇళ్ళకు వెళ్ళి పలకరించడం ఆనవాయితీ అని.

పలకరించడం సాంప్రదాయమే గానీ అందుకు ఒకరో ఇద్దరొ వెళ్ళి పలకరిస్తారు గానీ ఇలా పెద్ద మందని వెంటేసుకొని,గుంపులు గుంపులుగా వెళ్ళి టీవీ కెమెరాలు మీడియా వాళ్ళు చుట్టూ చేరి ఉంటే ఒక సర్కస్ లాగా ఆ పని చేయరు కదా?
రెండవది, జగన్ చాలా ఎమోషనైపోయి చెప్పినది ఏమంటే "వాళ్ళ కన్నీళ్ళు నేను తుడవాలి,నా కన్నీళ్ళు వాళ్ళు తుడవాలి" అని.

కన్నీళ్ళు తుడవాలి నిజమే, కానీ ఎప్పుడు?చనిపోయిన పది నెలల తరువాతనా?వైఎస్ మరణం తట్టుకోలేకనో, సహజం గానో ఆ మరణినిచిన వాళ్ళలో అత్యధికులు మధ్య, దిగువ తరగతి వాళ్ళే.అలాంటి కుటుంబాలలో చనిపోయిన వాళ్ళని తలుచుకొంటూ నెలల తరబడి గడిపితే బతుకు బండి నడవదు.కాబట్టి విషాదాన్ని దిగమింగి జీవనం సాగిస్తూ ఉంటారు వాళ్ళందరూ.ఇప్పుడు నువ్వు వెళ్ళి తుడవడానికి వాళ్ళ దగ్గర కన్నీళ్ళేమీ మిగిలి ఉండవు బాబూ.

ఇక నీ కన్నీళ్ళు తుడవడం గురించి చెప్పుకోవాలంటే,ఆ మొదట్లో ఒకటి రెండు రోజులు తప్ప నువ్వు రాజకీయ ఎత్తుగడల్లో మునుగిపోయి ఉన్నావు కానీ కన్నీళ్ళు కారుస్తూ ఉన్నట్టు ఎవరికీ కనిపించలెదు కదా?

అంచేత ఇప్పుడు ఇంత యాగీ చేసి ఈ ఓదార్పు యాత్ర చేయడం వెనక అసలు పరమార్ధమేమిటో కాస్తా వివరిస్తే బావుంటుంది కదా జగన్మోహనా?

Thursday, July 8, 2010

ఆక్టోపస్సూ,ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసినట్టుండాలి.

జర్మనీలో ఒక రెస్టారెంట్లోని పాల్ అనే ఒక ఆక్టోపస్ జర్మనీ ఆడే ప్రపంచ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ లలో ఎవరు గెలుస్తారు అన్న దానిని ఇప్పటివరకూ కరెక్టుగా చెబుతూ వచ్చింది.నిన్న సెమీ ఫైనల్లో స్పెయిన్ చేతిలో జర్మనీ ఓడిపోతుందని కూడా సరిగ్గానే చెప్పింది.అయితే దీనితో ఆ రెస్టారెంటు యజమానికి చిర్రెత్తుకొచ్చి అదే జరిగితే పాల్ ని కోసి కూర వండేస్తానని చెప్పాడు.పాపం దాని ఖర్మ కాలి జర్మనీ ఓడిపోయింది.ఇప్పుడు దాని భవిష్యత్తు ఏమౌతుందో?
అయినా జర్మనీ ఓటమికి ఆక్టోపస్సుని నిందిస్తే ఎలా?ఆ మ్యాచ్ లో వాళ్ళ ఆట అలా తగలడింది.మొదటి అరగంటలో బంతిని తమ అధీనంలో ఉంచుకోవడానికే వాళ్ళు నానా తంటాలు పడాల్సి వచ్చింది.అర్జెంటీనాని చిత్తు చేసింది వీళ్ళేనా అని అందరీ ఆశ్చర్య పోయేంత చెత్తగా ఆడారు వాళ్ళు.
అయినా భవిష్యత్తు చెప్పేటప్పుడు అంతా తియ్యగా చెప్పాలని ఆ ఆక్టోపస్సుకి తెలీదులాగుంది.ఉగాదినాడు మన రాజకీయనాయకుల దగ్గర పంచాగ శ్రవణం చేసే పంతుళ్ళనడిగి తెలుసుకొని ఉండాల్సింది ఆ జీవి పాపం!

Monday, July 5, 2010

ఈ ఇరాన్ న్యాయమూర్తులు మనుషులేనా?

ఇరాన్ దేశంలో సకినే మొహమ్మదీ అష్తియాని అన్న మహిళ మరణ శిక్ష విధించబడి ఆ శిక్ష అమలుకోసం వేచిచూస్తూ ఉంది.మరణ శిక్ష అంటే ఆమె ఏదో చాలా పెద్ద నేరం చేసిఉంటుందేమో అనుకొంటే తప్పే.చేసిందో లేదో ఆమె పైన ఆరోపించబడ్డ నేరం వివాహేతర సంబంధం.ఇది కూడా పెద్ద తప్పేనా అని అనుకొనేరు. ఇంత కన్న పెద్ద షాకేమిటంటే ఈ శిక్ష అమలు చేసే రాళ్ళతొ ఆ వ్యక్తి చచ్చే దాకా కొడతారు. ఈ రాళ్ళు ఒక్క దెబ్బకి మనిషి చచ్చేంత పెద్దవిగా ఉండవు. అలవి గాని బాధ అనుపద్ధతి.
అది రాళ్ళతో కొట్టి చంపడం!!ఇందులో శిక్ష పడ్డ వ్యక్తిని చాతీ దాకా నేలలో పూడుస్తారు.చుట్టు మనుషులు(మృగాలు అనాలేమో) చేరి భవించి సుధీర్ఘమైన నరక యాతన తరువాత కానీ మరణం రాదు ఇందులో.
సకినేకి ఈ శిక్ష తప్పింకావాలనిచాలని ఆమ్నెస్టీతో సహా అనేక సంస్థలూ వ్యక్తులూ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం సఫలం కోరుకొందాం