నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, April 30, 2011

తాలిబాన్ టైగర్స్, దావూద్ డెవిల్స్, లాడెన్ లయన్స్ - పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్.


IPL లో తమ దేశానికి చెందిన ఒక క్రికెటర్‌ని కూడా సెలక్ట్ చేసుకోకపోవడం పాకిస్తాన్‌లో చాలా మందికి కోపం తెప్పించింది. ఈ అవమానానికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. ఆ దేశానికి చెందిన రాజకీయ నాయకులు, అంటే బిన్ లాడెన్, ఐ ఎస్ ఐ, దావూద్ ఇబ్రహీమ్, తాలిబాన్ లాటి వాళ్ళు కలిసి తమకీ ఒక ప్రీమియల్ లీగ్ ఉండాలని భావించారు. లీగ్ అంటే డబ్బుతో కూడుకున్న విషయం కాబట్టి తమ దేశ వ్యాపార వేత్తలతో అంటే ఒసామా బిన్ లాడెన్, తాలిబాన్, ఐ ఎస్ ఐ, దావూద్ ఇబ్రహీమ్ లతో మాట్లాడి PPL  అంటే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్‌ని అనౌన్స్ చేశారు.
 
ఇక జట్ల కోసం బిడ్డింగ్ చేస్తే కుప్పలు తెప్పలుగా బిడ్స్ వచ్చి పడ్డాయి. దాంతో ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఆశ్చర్యంతో ఉబ్బి తబ్బిబ్బై పోయింది. తమ లీగ్ మొదలైతే IPL మట్టి గొట్టుకు పోవడం ఖాయం అని జట్లను అనౌన్స్ చేసింది. అందులో మచ్చుకు కొన్ని జట్లు ఇవి: లాడెన్ లయన్స్, దావూద్ డెవిల్స్, తాలిబాన్ టైగర్స్, ఐ ఎస్ ఐ ఇన్విన్సిబుల్స్, బుఖారీ బుల్లెట్స్, కరాచీ కింగ్స్. ఎలాగూ IPL  మటాషై పోతుందని తీర్మానించేశారు కాబట్టి ఎందుకైనా మంచిదని ఇరవై జట్లతో లీగ్ లాంచ్ చేశారు. 
  
ఇక ఆటగాళ్ళ కోసం వెదుకులాట మొదలు పెడితే పాకిస్తాన్‌లో ఆడ్డానికి ఆ దేశ ఆటగాళ్ళే ఒప్పుకోలేదు రక్షణ ఉండదని. ఏదైనా తటస్థ వేదిక అంటే భారత్, లండన్, దుబాయ్, షార్జా అయితేనే ఆడుతామని తెగేసి చెప్పారు. చచ్చీ చెడీ, దేశ రక్షణ మంత్రితో సెక్యూరిటీ పైన భరోసా ఇప్పించి ఒప్పించారు. ఇక తీరా వేలం మొదలు పెడితే IPL లో లేని వాళ్ళు, రిటైరై కోచ్ పదవులకి వెళ్ళే ఆలోచనలో ఉన్న వాళ్ళు ముందుకొచ్చారు. అందరూ IPL నుండి పిలుపు వస్తే వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటేనే సంతకం పెడతామని పట్టు పట్టారు. అందుకు రెడీ అని జట్లని సిద్ధం ఏశారు. 
 
ఇక లాహోర్‌లో మొదటి మ్యాచ్ మొదలు పెట్టారు. స్టేడియంకి చుట్టూ  రెండు కిలోమీటర్ల మేరా సెక్యూరిటీ బలగాలను దింపి చీమ సైతం తమని దాటి పోలేనంత కట్టుదిట్టంగా కాపలా కాయడం చూసి ఆటగాళ్ళకి తమ ప్రాణాలమీద భయం లేకుండా చేశారు. స్టేడియంలో సగం ప్రేక్షకులూ, మిగతా సగం పోలీసులూ సైనికులూ ఉండడం చూసి ఆటగాళ్ళందరికీ ఏమూలో ఉన్న మిగిలినా ఆకాస్త భయం కూడా పోయింది. 
 
టాస్ అయ్యాక ఆటగాళ్ళు ఒక్కొక్కరుగా మైదానంలోకి వస్తుండగా ప్రేక్షకులు హర్షధ్వానాలు మిన్నంటాయి. ప్రతి ఆటగాడూ బ్యాట్స్‌మన్‌తో సహా చెవుల్లో బ్లూ టూత్ డివైసెస్ పెట్టుకొని ఉండడం గమనించిన అంపైర్ ఫీల్డింగ్ జట్టు కెప్టెన్‌ని పిలిచి విషయమేంటని అడిగాడు.
 
"సార్ అవి సెల్ ఫోన్స్. వాటిలోంచి మాకు మధ్యమధ్యలో ఆర్డర్స్ వస్తాయి. ఎప్పుడు నోబాల్స్, వైడ్స్ వెయాలో, అలాగే ఎప్పుడు లూజ్ బాల్స్ వేసి బౌండరీలు ఇవ్వాలో. అలాగే బ్యాట్స్‌మన్‌కి కూడా ఎప్పుడు అవుటవ్వాలో అని. దాని పట్టి మేం ఆడాలి"అని వివరించాడు అతను. "NO..no.... This is not cricket. I won't allow this to happen as an umpire. I will report this matter to ICC" అంటూ కోపంగా వెళ్ళిపోబోయాడు సదరు అంపైర్. "" ఆగండి సార్. మీక్కూడా ఒక ఫోన్ ఉంది. మీది మీకివ్వడం వాళ్ళు మర్చి పోయి నకిచ్చి పంపారు. తీసుకోండి. ఫస్ట్ కాల్ అందులో ICC నుండే వస్తుంది" అని జేబులోంచి ఒక ఫోన్ తీసి అంపైర్ చేతికిచ్చాడు కెప్టెన్. "I don't obey their orders. I will inform this matter to the world media" కోపంగా విసిరి కొట్టాడు అంపైర్. 
 
అతన్ని జాలిగా చూశాడు కెప్టెన్. "సార్ తీసుకోండి. దాన్లో చెప్పినట్టు చేస్తే మీరి విమానం సీట్లో కూర్చుని ఇంటికెళ్తారు. లేకుంటే కాఫిన్లో కార్గో ఏరియాలో వెళ్తారు" అన్నాడు. సడెన్‌గా బాబ్ ఊల్మర్ గుర్తొచ్చి ఫోన్ తీసి జేబులో, బ్లూటూత్ చెవిలో పెట్టూకొని మ్యాచ్ ప్రరంభించండి అని సైగ తీశాడు అంపైర్.


మ్యఛ్ మొదలయింది. ఆటగాళ్ళందరూ సీరియస్‌గా మధ్య మధ్యలో చెవుల్లో వినపడే ఆర్డర్స్‌ని అనుసరించి ఆట మొదలు పెట్టారు. కాస్సేపటికి బ్యాట్స్‌మన్ సిక్సర్ కొట్టాడు. చుట్టూ ఉన్న లౌడ్ స్పీకర్లలోంచి సూఫీ కీర్తనలు పెద్దగా వినిపించాయి. ఛీర్ గాళ్స్ స్టీజీ మీదకి ఎక్కారు. నిండుగా బురఖాలు ధరించి నమాజ్ చేస్తున్నట్లు కూర్చుని కాస్సేపు అయ్యాక దిగి వెళ్ళిపోయారు.
  
అలా ఒక ఇన్నింగ్స్ పూర్తయి, రెండో ఇన్నింగ్స్ మొదలయ్యి సగం పూర్తయ్యాక ప్రేక్షకుల గ్యాలరీలో ఒక పెద్ద పేలుడు సంభవించి సగ భాగం స్టేడియం ధ్వంసమయి పోయింది. ఎవరో ప్రేక్షకుడు తన నడుము కున్న బాంబు పేల్చడంతో ఆ పేలుడు జరిగి కొంచెం అటూఇటుగా ఓ వందమంది చచ్చిపోయారు.
దాంతో ఆ పూటకి ఆట రద్దు చేసి మిగతా ఆట రేపు ఇదే వేదిక మీద జరుగుతుందని అనౌన్స్‌మెంట్ చేశారు నిర్వాహకులు.
 
టీం బస్సెక్కి హోటల్ గదులకు తిరిగి వెళ్తుండగా అప్పటికి షాక్ నుండి తేరుకున్న ఓ విదేశీ ఆటగాడు తన పక్కనున్న షాహిద్ ఆఫ్రిదీని అడిగాడు. "అంత టైట్ సెక్యూరిటీ పెట్టారు. అయినా బ్లాస్ట్ ఎలా జరిగింది బాస్?" షాహిద్ ఆఫ్రిదీ అతన్ని చూసి , అర్జునుడికి భగవద్గీత భోధిస్తున్న అర్జునుడిలాగా ఓ చిరు నవ్వు నవ్వి, " పిచ్చి వాడా అంత టైట్ సెక్యూరిటీ ఉండబట్టే కదా, ఒకటిన్నర ఇన్నింగ్స్ ఆడగలిగాం. పాకిస్తాన్ పోలీసులా మజాకా! చూడు రెండొందల మంది చచ్చుంటారు ఆ బ్లాస్ట్‌లో. ఒకా ప్లేయరయినా చచ్చాడా?" అన్నాడు. 


ఆ విదేశీ ఆటగాడు మళ్ళీ షాక్ నుండి తేరుకునేలోగా హోటల్ వచ్చింది.

Friday, April 29, 2011

అద్వైతమే హిందుత్వానికి శరణ్యం



ఈ మధ్య  బాబాల, స్వామీజీల టైమ్ అసలు బావున్నట్లు లేదు. మహా టీవీ వాడు ఆ మధ్య వరుసగా కల్కి భగవాన్ గారినీ, ఆయనతో బాటు కొలువైన అమ్మ భగవాన్‌నీ వరుసగా ఉతికి ఆరేశాడు. ఆశ్రమంలో జరిగే భాగోతాలన్నీ దృశ్యాలతో సహా బయటపెట్టి కంపు కంపు చేసి పారేశాడు. తరువాత నిత్యానంద స్వామి వారి రాసలీలలు వీడియోతో సహా మన డ్రాయింగ్ రూమ్‌లలో మనందరం చూసినవే. యూ ట్యూబ్‌లో అత్యధిక ఆదరణ పొందిన వీడియోగా ఖ్యాతిని దక్కించుకొన్న ఘనత కూడా అయ్యగారికి దక్కింది. ఇప్పుడు సత్య సాయి బాబా గారు దాదాపు నెల రోజులు హాస్పిటల్‌లో మరణంతో పోరాడి కన్ను మూశారు. ఈ ఘట్టంలో సత్య సాయి ట్రస్టు వాళ్ళు తమ చేష్టలతో స్వామి వారిని అపఖ్యాతి పాలు ఛేశారు. ఇంటర్నేషనల్, నేషనల్ లెవల్ బాబాల స్థితి ఇలా ఉంటే, రోజుకొకటిగా లోకల్ స్వాములని ఉతికి ఆరేస్తున్నారు మీడియా వాళ్ళు.
    

ఇలా మన ఆధ్మాత్యక గురువులు  భ్రష్టు పడుతూ ఉంటే ఇది హిందుత్వాన్ని దెబ్బ తీస్తుందా, అసలు హిందూ మతాన్ని దెబ్బ తీయడానికి ఇదంతా కిరస్తానీ వాళ్ళు చేస్తున్న కుట్రా అని ఎవరికైనా అనుమానం వస్తే రావొచ్చు. కానీ నా ఉద్ధేశ్యంలో ఇదంతా హిందూ మతం మంచికే.

    
ఏనాడో శంకరాచార్యులు ప్రవచించిన, తరువాత వివేకానందుడు బోధించిన అద్వైతాన్ని నమ్ముకోవడమే హిందూ మతానికి రక్ష. సర్వం ఖల్విదం బ్రహ్మం, అహం బ్రహ్మస్మి అని అద్వైతం చెప్తుంది. విశ్వ మంతా బ్రహ్మం నిండి ఉంది, ఆ బ్రహ్మమే నాలోనూ ఉంది. అటువంటప్పుడు ఈ స్వామీజీలు, బాబాలు నాకెందుకు అని ప్రశ్నించ గలిగితే ఈ బాబాలు, స్వాముల గొడవ ఉండదు. అయితే మనం ప్రార్దించడానికి, ఏదైనా ఆపద వచ్చినప్పుడు వేడుకోవడానికి ఒక ఆధారం గానీ, సింబల్ గానీ కావాలి కదా అనుకొంటే, అందుకోసం మన వాళ్ళు ముగ్గురు ముఖ్య మైన దేవుళ్ళని త్రిముర్తులుగా, వీళ్ళు సరిపోరనుకొంటే మరో మూడు కోట్ల మంది చిన్నా చితకా దేవుళ్లనీ పుట్టించారు. వాళ్లతో పని పూర్తి చేసుకోవచ్చు. 


గ్రంధసాంగుడినే: అంగీకరించిన నిత్యానాంద


రంజితతో తన రాసలీలలు దృశ్యాలతో సహా బయటపడి నానా కంపు అవడంతో కొన్నాళ్లు ఎవరికీ కన్పించకుండా పోయి నటి తరువాత పోలీసులకు పట్టుబడి బయటపడ్డ సెక్స్ స్వామి అలియాస్ నిత్యానంద స్వామి ముందు ఆ వీడియోలు బూటకమనీ, ఎవరో తనకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర అని బుకాయించాడు. తరువాత తనసలు మొగాడినే కాననీ, సెక్స్‌లో పాల్గొనే సామర్ధ్యం తనలో లేదనీ తప్పించుకో చూశాడు.
 
కానీ ఏమయిందో ఏమో తరువాత పొలీసుల విచారణలో ప్లేటు ఫిరాయించి రూటు మార్చాడు. తనకి అంగ స్థంబన సమస్యలున్నాయే కానీ శృంగారం చేయగల కెపాసిటీ ఉందనీ, గత కొన్నేళ్ళుగా తన భక్తురాళ్ళతో వారి అంగీకారం తోనే సెక్స్‌లో పాల్గొన్నానని చెప్పాడు. అయితే వాళ్ళ పేరు గుర్తు లేవనీ, వారి సంఖ్య సుమారు 15 ఉండొచ్చని అంగీకరించాడు.
  
వాళ్ళు ఇష్టపడి ఆయనతో సెక్స్ జరిపితే మనకేమిటి సమస్య, ఈ విషయం పైన ఇంత రాధాంతం చేసి, బ్లాగు కెక్కాల్సిన అవసరమేముంది అన్న ప్రశ్నలు ఎవరికైనా రావొచ్చు. ఇష్టపడి శృంగారం జరపడానికి ఎవరికైనా ఇంత కన్నా పోటుగాళ్ళే దొరకరా? వాళ్ళని తనతో పడుకోబెట్టడానికి ఈ నీచుడు మతాన్ని, భక్తినీ, నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాడుకొని నయాన్నో, భయాన్నో లొంగదీసుకోకపోతే ఇంతకన్నా మగాళ్ళు లేరా లోకంలో?

బాబాలు, స్వాముల ముసుగులో ఈ నీచ, నికృష్ట, అధమాధమ, ఛండాల గుంపు హిందుత్వాన్ని భ్రష్టు పట్తిస్తున్నారని, నిజమైన ఆస్తికులు వీళ్ళకి దూరంగా ఉండాలనీ, తమకు తెలిసిన వాళ్ళెవరైనా వీళ్ల వైపు వెళ్తుంటే వాళ్లని కాపాడాలనీ ఈ పోస్టు అర్ధిస్తుంది.

నీచ నికృష్టానంద స్వామి వికృత రాసలీలలు


సెక్స్ స్వామిగా పేరుగాంచిన నిత్యానంద స్వామి రాసలీలలు పోలీసుల విచారణలో ఒకటొకటిగా బయటపడుతున్నాయి. వీటిలో కేవలం ప్లాట్‌ఫారం పైన దొరికే చీప్ బూతు పుస్తకాలలో ఉండే ఒక టైప్ భాగోతం ఒకటుంది.



స్వామివారు తరచూ తమ ఏకాంత మందిరంలో భక్తురాళ్ళకు (భక్తులకు ఈ అవకాశం లేదు) తన ఏకాంత సేవ చేసుకునే అవకాశం ఇస్తుంటారు. ఆ సమయంలో కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలో ప్రవేశించి సమాధి స్థితి లోకి వెళ్తుంటారు.  ఆ సమయంలో తన ఆత్మ తన శరీరాన్ని విడిచి వెళ్తుందని, మళ్ళీ తన ఆత్మని తన శరీరంలో ఐక్యం చేయాలంటే ఆ భక్తురాలు తనతో శృంగారంలో పాల్గొనాలని భోధిస్తారు.
   

ఈ నాలుగు మాటలు చెప్పగానే ఆమె అతనితో సెక్స్‌లో పాల్గొంటుందని కాదు. అందుకు అయ్యగారు తనకు తెలిసిన మిగతా విద్యలు అన్నీ వాడుతారేమో? ఆ మాత్రం టాలెంటు లేక పోతే పాయింట్ ఫైవ్ మొహంతో అంత మంది అనుచర గణాన్ని, అన్ని కోట్ల సంపదనూ పోగు చేయగలడా?


ఈ సేవా కార్యక్రమంలో అంగ ఛూషణ అన్నది ప్రధాన భాగంగా ఉంటుందనీ, అలా చేసినందు వల్ల తన ఆత్మ తిరిగి తన శరీరంలో ప్రవేశించి, మరి కోమ్త కాలం ఈ మానవాళికి తన సేవలు, దీవెనలు అందుకొనే భాగ్యం కలుగ చేసిందని చెప్పి, సదరు భక్తురాలిని మనసారా దీవించి పంపిస్తారట.

ఈ భాగోతం తాలూకు పూర్తి వివరాలు బాధిత భక్తురాళ్ళు పోలీసులకు పుసగుచ్చినట్లు అందించారు. ఈ వివరాలతో వాళ్ళు అయ్యగారిమీద కేసులో ప్రొసీడవుతున్నారు. అయితే ఆ భక్తురాళ్ళ వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు.