నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, November 28, 2012

ధోనీ చిన్నప్పుడు మీ టీచర్ నీకు ఈ నీతి వాక్యాలు చెప్పలేదా?


ప్రతి ప్రాధమిక పాఠశాలలోనూ పిల్లలకి బోధించే నీతి వాక్యాలలో చెరపకురా చెడేవు, ఎవరు తీసిన గొయ్యిలో వారే పడతారు అన్నవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చదువుకున్న స్కూలులో ఇవి చెప్పినట్లు లేదు. అలా చెప్పి ఉంటే ముంబయిలో నిన్న ముగిసిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో మన వాళ్ళు అంత దారుణంగా దెబ్బ తిని ఉండే వాళ్ళు కాదేమో.
 
ముంబయిలో పిచ్ తయారు చేసే క్యూరేటర్‌కి స్పిన్ మ్యాచ్ కావాలని ధోనీ ఆర్డరేశాడు. మొదటి మ్యాచ్‌లో మన వారి స్పిన్ ఎదుర్కోలేక ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ తంటాలు పడ్డం చూసి అతను అలా అడిగాడు పాపం. మొదటి రోజు. మొదటి ఓవర్ కాదు మొదటి బంతి నుంచే పిచ్ మీద స్పిన్ తిరగాలని అయ్య గారు శాసించారు. భారత జట్టు కెప్టెన్, అందునా కపిల్, గంగూలీలా కాకుండా బీసీసీఐకి బాగా ఇష్టమైన కెప్టెన్ అలా కోరితే ఆఫ్ట్రాల్ ఒక క్యూరేటర్ కాదన గలడా?
 
మామూలుగా టెస్ట్ మ్యాచ్ పిచ్ అంటే మొదట్లో ఫాస్ట్ బౌలింగ్‌కి అనువుగా ఉండాలి. అంచేతనే అన్ని జట్లు ఫాస్ట్ బౌలింగ్‌ని సమర్ధంగా ఎదుర్కొని మొదటి ఒకటి రెండు గంటలు అవుటవకుండా ఆడగలిగే టెక్నిక్ ఉన్న వారినే ఓపెనింగ్ స్లాట్‌కి ఎంపిక చేస్తాయి. సునీల్ గవాస్కర్, జెఫ్ మార్ష్, డేవిడ్ బూన్, గార్డన్ గ్రీనిడ్జ్ ఇలా బాగా పేరు మోసిన ఓపెనర్లందరూ ఫాస్ట్ బౌలింగ్ ఆడడంలో సిద్ధ హస్తులయి ఉంటారు. తరువాత ఆట కొనసాగే కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలించి చివరి ఒకటిన్నర రెండు రోజుల్లో పిచ్ మీద పగుళ్ళు ఏర్పడి స్పిన్‌కి అనుకూలంగా మారుతుంది. ఆ స్థితిలో స్పిన్నర్లు రెచ్చి పోతుంటారు. ఇక ముంబయి మ్యాచ్ విషయానికొస్తే ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నప్పుడు మ్యాచ్ గెలిచేశానని అనుకొని ఉంటాడు. ఎందుకంటే చివరి ఇన్నింగ్స్ ఆడేది ఇంగ్లాండ్ కాబట్టి, వాళ్ళు మనవారి స్పిన్ బౌలింగ్‌ని తట్టుకొని నిలబడలేరని ఇక తనకి జయమ్ము నిశ్చయమ్ము అనుకొని ఉంటాడు.

కానీ జరిగింది అందుకు విరుద్ధంగా ఉంది. చెరపకురా చెడేవు అన్నట్టు తాను తీసికున్న స్పిన్ పిచ్ గుంతలో తనే పడ్డాడు ధోనీ భాయ్. ఇంగ్లండ్ జట్టులోని పానేసార్, స్వాన్‌లు వేసిన బంతులు మెలికల్ తిరుగుటుంటే పిచ్ మీద మిరకల్ జరిగి మన వాళ్ళు అయ్యయ్యో అంటూ దెబ్బ తిని ఓటమి పాలయ్యారు.

ఇతరుల తప్పులనుంచి పాఠాలు నేర్చుకొనేవాడు ఉత్తముడు, తన తప్పుల నుంచి నేర్చుకునేవాడు మధ్యముడు, అసలు పాఠాలు నేర్చుకోలేనివాడు అథముడు అని ఇంకొక నీతి కూడా ఉంది. ఇప్పుడు కొలకత్తాలొ జరగబోయే మూడో మ్యాచ్‌కి కూడా స్పిన్ పిచ్ కావాలని పట్టు పడుతూ తాను కనీసం మధ్యముండ అని కూడ అనిపించుకోలేక, అధముండ అని నిరూపించుకోబోతున్నాడు మహీ.

Sunday, November 25, 2012

ఓట్ల జడి వాన కురిపించే స్కాము శ్రీ పథకం


రాజ శేఖర్ రెడ్డి ఎన్నికలలో గెలిచి రెండవసారి అధికారంలోకి రావడానికి ఆరోగ్యశ్రీ పథకం చాలా ఉపయోగపడిందని అందరూ ఒప్పుకుంటారు. ఈ పథకం ద్వారా లాభపడ్డవాళ్ళే కాకుండా వారి చుట్టుపక్క కుటుంబాలవారిమీద కూడా దీని ప్రభావం బాగా పని చేసింది. ఇందులో మరొక గొప్పతనం ఏమిటంటే ఈ పథకం వల్ల ప్రజారోగ్య వ్యవస్థ దెబ్బతిని పొయినా అది ఎవరికీ కనిపించక పోవడం. ఎన్నికలలో ఎలాంటి పథకాలే ఓట్లు రాలుస్తాయి. ఆరోగ్య శ్రీలో లాభపడ్డవారిలో పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓట్లు వేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. హైటెక్ సిటీలూ, ఐటీ కంపెనీలూ తీసుకొస్తే వాటి వల్ల లాభ పడ్డ వాళ్ళెవరూ వెళ్ళి క్యూలో నించుని ఓటేసే శ్రమ తీసుకోరు.

ఇలా ఓట్లు రాల్చే మహత్తర పథకమే నేను చెప్పబోతున్న స్కాముశ్రీ. ఇది అధికారంలో లేకుండా, అధికారంలోకి రావాలని తపన పడే వారి కన్నా ఆల్రెడీ అధికారంలో ఉండి ఎన్నికలను ఎదుర్కోబోతున్న  వారికి బాగా ఉపయోగపడుతుంది. దిన్ని శ్రద్ధగా చదివి ఆచరిస్తే కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ పీఠం ఎక్కడం (సోనియమ్మ ఎక్కనిస్తే) ఖాయం.

పొద్దున్న లేచి పేపర్ తెరిస్తే, న్యూస్ చానల్ పెడితే ప్రతి రోజూ ఏదో ఒక స్కామ్ కనపడుతూ ఉంటుంది. ప్రతి రోజూ scam of the day అని పత్రికలు ఒక కాలమ్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అంతా స్కాము మయం, ఈ జగమంతా స్కాము మయం అని శ్రీరామదాసు సినిమాలో పాట ట్యూనులో పాడుకోవలసి వస్తూంది. మద్యం దుకాణాలు, ఇసుక మాఫియా, గనుల కుంభకోణాలు, టూజీ స్పెక్ట్రం, బొగ్గు గనుల వేలం ఇలా జిల్లాల, రాష్ట్రాల, దేశం లెవెల్లో వివిధ స్థాయిల్లో స్కాములు బయట పడుతూ ఉన్నాయి.
 
అయితే జాగ్రత్తగా గమనిస్తే జనం ఈ స్కాములని చూసి నాయకులని అసహ్యించుకోవడం లేదు. ఒక చిన్న స్కామైనా చేయడానికి తమకు చాన్స్ లేదే అని బాధ పడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. నేతనైనా కాకపోతిని స్కాము ఒక్కటి చేయగా అనుకొనే వాళ్ళే ఎక్కువమంది ఉంటారు. ఇలా స్కాములు చేయడానికి అవకాశం, అధికారం లేని సాధారణ ఓటర్లకు స్కాములు చేసే అవకాశం కల్పించడమే ఈ స్కాముశ్రీ లక్ష్యం.

దీనిలో క్షేత్ర స్థాయిలో స్కాము మిత్రలు ఉంటారు. వీళ్ళు ఇంటింటికీ వెళ్ళి ఆ ఓటర్ల గురించిన వివరాలు నమోదు చేస్తారు. ఆ వివరాలను స్టడీ చేయడానికి ఆ పై స్థాయిలో స్కాము కోఆర్డినేటర్లు, స్కాము జీఎంలూ ఇలా నానా స్థాయి ఆఫీసర్లు ఉంటారు. ఈ ఉద్యోగాలు అన్నీ రాజీవ్ యువ కిరణాల కింద లెక్కేస్తే ఆ పథకం కూడా గట్టెక్కుతుంది. ఈ స్టడీ పూర్తయ్యాక ఒక్కో తెల్ల కార్డు కుటుంబానికీ కొంత స్కాము చేసే అవకాశం వస్తుంది. అలాగే ఎక్కడేక్కడ స్కాములు చేసే వీలుందో పరిశీలించే విభాగం మరొకటి పెట్టి అందులో నానా స్థాయి అధికారులని నియమిస్తే అదొక ఉద్యోగాలు పుట్టించే విభాగం అవుతుంది.
 
స్కాముల కోసం గనులు, పోరంబోకు స్థలాలు, ఇసుక రీచ్‌లు, ప్రాజెక్టులు, నీటి కాలువలు ఉండనే ఉన్నాయి. అవి చాలక పొతే ఉన్న తారు రోడ్లు తవ్వే పనులు ఇవ్వచ్చు. ఆ పిదప ఆ రోడ్ల స్థానంలో సిమెంటు రోడ్లు వేయించవచ్చు. 

ఈ స్కాము శ్రీ వల్ల అధికారంలో ఉన్న వారికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రజలందరికీ ఏదో రూపంలో డబ్బు అందుతుంది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు. మహా నేత అన్న బిరుదు తగిలించుకోవచ్చు. బతికుండగానే ప్రతి ఊరిలో, కూడలిలో విగ్రహాలు పెట్టుకోవచ్చు. పాలనలో దొర్లే తప్పులు ప్రతిపక్షాలు ఎత్తి చూపించినా పట్టించుకునే తీరికా ఓపిక జనానికి ఉండదు. అది గాక అందరూ స్కాముల్లో భాగస్వాములు అవుతారు కాబట్టి నేతలు చేసే బడా స్కాములని ఎవరూ పట్టించుకోరు. అప్పుడు దర్జాగా ఖజానాని దోచిపారేసి తరువాత వచ్చే ఎన్నికలలో కొంత ఖర్చు పెట్టి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవచ్చు.

కిరణ్ కుమార్ రెడ్డి గారూ దీని మీద కొంత మనసుపెట్టి ఆలోచించండి మరి.

Saturday, November 24, 2012

సవితా బాబీని తగులుకోబోతున్న రామ్ గోపాల్ వర్మ


గత కొన్నేళ్ళుగా సరయిన హిట్ లేక విజయం కోసం మొహం వాచిపోయిన రామ్ గోపాల్ వర్మకి అర్జంటుగా ఒక సూపర్ హిట్ కావాలి. హిందీలో లాభం లేదని తెలుగులోకి వచ్చి కామెడీ పండిదామని అనుకుంటే అప్పల్రాజు ట్రాజెడీనే మిగిల్చాడు. ఎన్నాళ్ళుగానో తనకి కలిసివచ్చిన మాఫియా కూడా తనని ఆదుకోకపోయేసరికి రూటు మార్చి ఫాక్షన్ డైరెక్షన్‌లో పోయినా కలిసి రాలేదు. ఇలా లాభం లేదని తనకి ఇష్ట దైవాలయిన భూతాలని ఆశ్రయించినా వర్మ గారికి కలిసిరాలేదు.
 
 దానితో ఈ సారి ఎలాగయినా హిట్టు కొట్టాలన్న పట్టుదలతో ఇంటర్‌నెట్‌లో సంచలనం రేకెత్తించి బ్యాన్‌కి గురయిన శృంగార గృహిణి సవితా బాబీ మీద సినిమా తీయాలని డిసైడయ్యాడు వర్మ.

గత కొన్ని సంవత్సరాలుగా savitabhabhi.com అన్న సైట్‌లో తన శృంగార కార్యకలాపాలతో ప్రతి రోజూ లక్షలాది మందిని ఆకర్షించి అనేక బాషల్లోకి అనువదించబడ్డ కామిక్ కేరక్టర్ ఈ సవిత. ఈమెకి పెళ్లయి భర్త ఉంటాడు. అయినా సరయిన తృప్తి లేక తనకి నచ్చిన వారితో శృంగార సాగరంలో తేలియాడుతూ ఉంటుంది. శుద్ధంగా చీరకట్టు, బొట్టుతో అచ్చమయిన భారత నారిలా కనిపించే ఈమె బ్రాలు అమ్మడానికి వచ్చిన సేల్స్ మాన్‌తో, భర్త కొలీగ్‌తో, వీదిలో క్రికెట్ ఆడుతూ బాల్ ఇంట్లో పడితే దాని కోసం వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళతో ఇలా అనేక మందితో జల్సా చేస్తూ ఉంటుంది. ఆ విషయాలన్నీ ఆ సైట్‌లో కామిక్ సీరియల్‌గా వచ్చేవి.

భారతీయ సంస్కృతిని ఈ కామిక్ నాశనం చేస్తూందని రాజకీయ నాయకులు పార్లమెంట్‌లో గోల చేసి ఆ సైట్‌ని నిషేధించారు. అయినా నెట్‌లో ఈ ఆంటీ సాహసాలు ఇప్పటికీ చూడొచ్చు. ఇక్కడ బ్యాన్ చేశాక ఈమె తన అడ్రస్ ఆస్ట్రేలియాకి మార్చి kirtu.com అన్న సైట్‌లో తన హవా అప్రతిహతంగా కనసాగిస్తూ ఉంది. అన్నట్టు ఈ బాబీకి ఫేస్‌బుక్‌లో కూడా అకౌంట్ ఉంది. www.facebook.com/BhabhiSavita.

ఈ సెక్సీ ఆంటీ మీద వర్మ గారి చూపు పడింది. తనని పరాజయాల పరంపర నుంచి తప్పించే శక్తి ఈ బాబీకె ఉందని డిసైడైన వర్మ ఇప్పుడు ఈమె గురించిన సినిమాకి స్క్రిప్టు రెడీ చేసుకుంటున్నాడు. అప్పల్రాజు లాంటి కామెడీ సినిమాలో ఒక పాటలో డాన్సర్ తొడల మధ్య, రొమ్ముల మీద కెమెరా పెట్టి అందాలని తెర మీద ఆరబోసిన వర్మ ఇప్పుడు సవిత బాబీ అందాలని విప్పి చూపించబోతున్నాడు. వర్మ ఏం చూపించమంటే అంత కన్నా ఎక్కువగా చూపించడానికి రెడీగా ఉండే రోజ్లిన్ ఖాన్‌ని సవితా బాబీ పాత్రలో ప్లాన్ చేస్తున్నాడట వర్మ. అయితే బాలీవుడ్ కథనాల ప్రకారం వర్మ ఈ సినిమాకి నిర్మాతగా మాత్రమే ఉంటాడట. తన శిబిరంలోని ఒక శిష్యుడికి దర్శకత్వ బాధ్యత అప్పగిస్తాడట. 

ఫ్లాపుల పరంపరనుంచి వర్మ గారిని సవితా బాబీ, రోజ్లిన్ ఖాన్‌లు బయట పడేస్తారేమో వేచి చూద్దాం.

Thursday, November 15, 2012

హిందుత్వాన్ని, రాముడి తత్వాన్నీ బద్ధలు కొట్టడం ఈ పింజారీ వెధవల వల్ల అవుతుందా?


దీపావళి రోజు నేను ఊహించినట్లే టీవీ9 వాళ్ళు ఒక నరకాసురుడి భక్తుడినీ ఒక హిందుత్వ వాదినీ పిలిచి చర్చ పెట్టారు. పోయిన సంవత్సరం కూడా ఇదే చానల్‌లో ఇదీ చర్చ చూశాను కాబట్టి ఈ సారి కూడా ఈ పెంట ఉంటుంది అని నేను ఊహించింది నిజమయింది. మొన్నామధ్య ఒక చానల్‌లో రావణాసురుడి భక్తుడు ఇన్నయ్య అనే మేధావి రావణుడు, శూర్పణఖ అసలయిన పూజ్యనీయులనీ, రాముడు, లక్ష్మణుడు గర్హనీయులనీ నోరు పారేసుకోవడం చూశాక ఈ సారి ఈ పింజారీ మూక నరకాసురుడిని నెత్తికెత్తుకోవడం నాకు ఆశ్చర్యమనిపించలేదు.

 
ఈ చర్చలో పాల్గొన్న నరకాసురుడి భక్తుడి పేరు తెలియలేదు కానీ అతగాడు చేసిన వాదన వింటే మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. "నరకాసురుడు మా తండ్రి, మా తాత, మా ముత్తాత. అతడిని కృష్ణుడు అన్యాయంగా, ఆడదాన్ని అడ్డు పెట్టుకొని వధించాడు. ఈ అన్యాయాన్ని మేం ఖండిస్తున్నాం. అందుకే ఈ దీపావళిని దీపాలు వెలిగించి సంబరంగా జరుపుకోము. ఇది మా దృష్టిలో ఒక దుర్దినం" అంటాడు ఈ అభినవ అసురుడు.
 
మరొక సందర్భంలో హిందుత్వాన్నే తప్పు అని, హిందుత్వ తత్వం ఆర్యులు ద్రావిడుల మీద బలవంతంగా రుద్దిన మతం అని దాన్ని బద్దలు కొట్టడమే తమ లక్ష్యం అని అవేశ పడిపోయాడు. ఆ వెంటనే రాముడి ప్రస్తావన రాగానే మళ్ళీ ఈ ప్రభుద్దుడికి ఎక్కడో కాలింది. రాముడు కూడా మోసగాడేనని, రాముడి తత్వాన్ని కూడా బద్ధలు కొట్టేస్తామని బీరాలు పోయాడు. ఇంకాస్త ఉంటే ఇంకా ఏమేం బద్ధలు కొట్టేవాడోకానీ, అదృష్టం కొద్దీ సమయం మించిపోయి యాంకరు పాప ఆ చర్చకి మంగళం పాడింది.

కుక్క మూతి పిందెల్లాంటి ఈ పింజారీ వెధవలకి హిందుత్వం నచ్చదు, హిందూ దేవుళ్ళు, దేవతలు నచ్చరు. జనాలు అందరూ పాపులని, గొర్రెల మందలనీ ప్రవచించే బోధనలు ఇంపుగా ఉంటాయి. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న సనాతన హిందూ ధర్మాన్ని ఈ నేలనుండి పెకళించడం ఈ పింజారీ, కుక్క మూతి పిందెల వల్ల ఏం అవుతుంది. వీరి భ్రమ కానీ!