నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, March 25, 2011

చెత్తా చెదారమంతా జగన్ పార్టీలోకే!!


వాసిరెడ్డి పద్మ, రోజా, లక్ష్మీ పార్వతి, జ్యోతుల నెహ్రూ, హరిరామ జోగయ్య, ఆనం వెంకట రమణా రెడ్డి...ఇలా ఎక్కడెక్కడ ఏ పార్టీలో ఎవరికి అసంతృప్తి కలిగినా అసమ్మతి రేకెత్తినా వాళ్ళందరూ చెప్పే మాట, పట్టే బాట ఒకటే జగన్ పార్టీ. జగన్ కూడా లేదనకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్లు కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నాడు.


      
ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో ఇలాంటి పరిస్థితే చిరంజీవికి ఎదురయింది. వచ్చిన వాళ్ళందరినీ చిరంజీవి ఎగేసుకొని ఎదురెళ్ళి కండువాలు కప్పి ప్రెస్ మీట్లు పెట్టి అహ్వానించాడు. తీరా ఎన్నికలయిపోయి పార్టీ బొక్క బోర్లా పడ్డాక వచ్చిన వాళ్ళందరూ బయటకెళ్ళిపోయారు. ఆ పోవడం కూడా మామూలుగా పోలేదు. చేతి కందిన రాళ్ళు విసిరి నానా మాటలని మరీ పోయారు. రేపు తనకి ఇదే పరిస్థితి ఎదురవకుండా జగన్ కాస్తా జాగ్రత్త పడాలి.  




     
తనలోకి వచ్చినదాన్నంతా కలుపుకుని సాగిపోయే గంగానదిలాగా ఉంటుందా, లేక మురికిని, చెత్తనీ కలుపుకుని కంపు కొట్టే మూసీ నదిలా ఉంటుందా జగన్ పార్టీ అనేది కొన్నాళ్ళలో తెలుస్తుంది.

ఇప్పుడిక చిరంజీవి కుటుంబంలో విలీనం కార్యక్రమం


కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్న తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి మంచి ఊపుమీద ఉన్న చిరంజీవి ఇప్పుడు తన కుటుంబంలో మరొక విలీనం ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. ప్రేమ వివాహం చేసుకుని తనకు దూరమైన కూతురు శ్రీజను తిరిగి కుటుంబంలో కలుపుకొనే దిశగా అడుగులు వేస్తున్నాడు. తన భర్త శిరీష్ పైన, అతడి తల్లి తండ్రుల పైన శ్రీజ కేసు పెట్టడం ఇందులో భాగమే. భర్తను వదిలి వస్తే తిరిగి కుటుంబంలో కలుపుకోవడానికి సిద్ధమే అని చిరు శ్రీజకు చెప్పినట్లు, అందుకు ఆమె సిద్ధమైనట్టు చిరు సన్నిహితులు చెబుతున్నారు. తండ్రి దగ్గర సాగిన హైక్లాస్ జీవితం దూరం కావడంతో, అల్ట్రా రిచ్ లైఫ్‌కి అలవాటు పడ్డ శ్రీజ మళ్ళీ ఆ జీవితం కోరుకొని చిరుకి దగ్గరయ్యేందుకు సిద్దమయిందని సమాచారం.



  
తన సినిమాలలో కుల మతాలకీ, పేద ధనిక తేడాలకీ అతీతంగా ఎన్నో పాత్రలు పోషించిన మెగా స్టార్ నిజానికి ఈ తేడాలకి అతీతుడు కాదని ఆయనని ఎరిగిన వారంటారు. కుల మతాలకీ, పేద ధనిక తారతమ్యాలు ఉండకూడదనీ సినిమాలలో, సామాజిక న్యాయం అని రాజకీయాలలో నానా యాగీ చేయడమే కానీ చిరంజీవి ఇవి పాటించడని, తన మొదటి కూతురు సుస్మితని హీరో ఉదయ కిరణ్‌తో నిశ్చితార్ధం జరిపి, తరువాత కొన్నాళ్ళకే దాన్ని రద్దు చేసి ఆ అమ్మాయికి మరొక పెళ్ళి చేయడం ఇందుకు నిదర్శనమని వారంటారు.


తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకుని తనని విడిచి వెళ్ళిన కూతురుని క్షమించి, కూతుర్నీ అల్లుడ్నీ, వారి కూతుర్నీ కుటుంబంలో కలుపుకొంటే చిరు పెద్దమనిషిగా నిలబడగలరేమో ఆయనే ఆలోచించాలి.

మరో ఫుకుషిమా భారత దేశంలో!!!!


జపాన్‌లో సంభవించిన భూకంపం, దానివలన వచ్చిన సునామీలే కాకుండా జపాన్‌నీ, చుట్టుపక్కల దేశాలనీ వణికించిన మరొక ప్రమాదం జపాన్‌లోని అణు విద్యుత్ కేంద్రాలలో సంభవించిన పేలుళ్ళు, తద్వారా కలిగిన రేడియేషన్. ఈ ప్రమాదం చూశాక అన్ని దేశాలూ అణు విద్యుత్ పైన పునరాలోచనలో పడ్డాయి. జర్మనీ తన దేశంలోని మూడు అణు విద్యుత్ కేంద్రాలని వాటి కాలపరిమితికన్నా ముందుగానే మూసి వేసింది. అమెరికా అన్ని కేంద్రాల పటిష్టతను పునఃసమీక్ష చేయడం మొదలు పెట్టింది. 
  


 


ఫుకుషిమా పేలుడువలన భారతదేశానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అధికారులు చెప్పినా అరేబియన్ తీరంలో, మహరాష్ట్రలోని జైతాపూర్ వాసులు మాత్రం వణికి పోతున్నారు. జైతాపూర్‌లో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అన్ని అనుమతులూ మజూరయి త్వరలో అక్కడ ఒక ప్లాంటు ఏర్పాటు కానుండడమే అందుకు కారణం. భూకంపమో, సునామీయో వస్తే కదా ప్రమాదం అని అనుకోకండి. గత ఇరవై సంవత్సరాలలో జైతాపూర్‌లో 92 భూకంపాలు సంభవించాయి. 1993లో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలు పైన 6.2గా నమోదయింది. ఈ వివరాలు ఈ ప్లాంట్ ఏర్పాటు కాకుండా పోరాడుతున్న కార్యకర్తలో, ఎలాగైనా దీనిని అడ్డుకుంటామని హెచ్చరించిన శివసేన వాళ్ళో చెప్పినవి కాదు. భారత ప్రభుత్వ సంస్థ, Geologocal Survey of India వెలువరించిన డేటా ఇది. 


  
ఇక్కడ భూమి అస్థిరమైనదనీ, అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఏమాత్రం అనువైనది కాదని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నా ప్రభుత్వానికి పట్టలేదు. ఫుకుషిమా పేలుళ్ళ నేపధ్యంలో ఇక్కడ ఏర్పడనున్న అణు కేంద్రం మరింత పటిష్టంగా ఏర్పాటు చేసేందుకు బధ్రతా ప్రమాణాల స్థాయి పెంచుతామని నిన్న కేంద్ర మంత్రి జైరాం రమేష్ చేసిన ప్రకటన ఇక్కడి ప్రజల భయాన్ని ఏమాత్రం తొలగించలేక పోయింది. 


ఈ చుట్టుపక్కల భూకంపం గానీ సునామీ గానీ సంభవించకుండా ఆ దేవుడే రక్షించాలని ఇక్కడి జనం బిక్కు బిక్కు మంటున్నారు.

Friday, March 11, 2011

కాలు కాలిన కోతికి కల్లు తాగించి, తోకకి నిప్పు పెట్టి, ముడ్డి మీద వాత పెట్టినట్లు

నిన్న మిలియన్ మార్చ్ ముసుగులో టాంక్ బండ్ మీద జరిగిన విధ్వంసం చూస్తే నాకు ఇలా అనిపించింది. పైగా ఉద్యమంలో ఇలాంటివి సహజమే అని ఒక బోడి సమర్ధన!


  
కోదండరాం‌ని, కేసీఆర్‌ని, కేటీఆర్‌నీ, కవితనీ కాల్చి పారేసి ఉద్యమంలో ఇలాంటివి కూడా సహజమే అని ఒక స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోయేది కదా!