నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, March 31, 2012

యోగి రాజన్నగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి!


మీడియా చేతిలో ఉంటే ఏం చేయవచ్చో చాలా కాలం క్రితమే గోబెల్స్ అనే పెద్ద మనిషి నిరూపించి గోబెల్స్ ప్రచారం అన్న ఒక కాన్సెప్టుకే సృష్టి కర్తగా వాసికెక్కాడు. సరయిన మీడియా లేని ఆ రోజుల్లోనే అంత చేసినప్పుడు అనేక రూపాల్లో మీడియా తన విశ్వరూపం చూపించే ఈ రోజుల్లో ఇంకెంత చేయగలమో నిరూపించాలని కంకణం కట్టుకున్న మీడియా అధినేతలు తమ విశ్వరూపాన్ని నానా రూపాల్లో ఆవిష్కరిస్తున్నారు. ఈ కోవలో మొదటి వరుసలో ఉండేవారిలో సాక్షి అధినేత జగన్ ఒకరు.
 
రాష్ట్రంలో ఇప్పుడు గాంధీ విగ్రహాలని మించి రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఉన్నాయి. గాంధీగారి కన్నా మిన్నగా రాజశేఖర్ రెడ్డి గారికి గుడులు కూడా కట్టేశారు. వాటిలో ఒకదానికి (నాకు తెలిసి ఒకటి. ఇంకా ఎక్కువ ఉన్నాయేమో తెలియదు)  ఏర్ కండీషనింగ్ కూడా ఉంది. ఆయన విగ్రహం పొలంలో పెట్టాక కొన్ని చోట్ల దిగుబడి కూడా ఎక్కువయిందట. ఇక సాక్షి పత్రికలో రోజుకొకటి చొప్పున ఆయన కొటేషన్లు వేస్తుంటారు. ఆయనకి మహానేత అన్న పేరు కూడా ఫిక్స్ చేసేశారు సాక్షి వాళ్ళు, గాంధీగారికి మహాత్మ లాగా.
 
రాజశేఖర్ రెడ్డి మరణించిన కొత్తలో, అప్పటికింకా జగన్ కాంగ్రెస్‌లో ఉండి సోనియా మాత దర్శనం కోసం వేచి ఉండే రోజుల్లో "మా నాన్న గాంధీ అంతటి వాడే" అని జగన్ ఒక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు ఆయన స్థాయి గురించి ఎవరికయినా అనుమానాలు మిగిలి ఉంటాయేమోనని. ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేని ఈ బ్లాగరు ఈ టాపిక్‌మీద వెటకారం వెళ్ళగక్కిన "జగన్ మోహన్ రెడ్డి గాంధీ సన్నాఫ్ రాజ శేఖర్ రెడ్డి గాంధీ" అనే పోస్టు ఇక్కడ చదవచ్చు .http://hittingontheface.blogspot.in/2010/07/blog-post_11.html

ఇప్పుడు జగన్ సహచరులు మరొక మెట్టు పైకెక్కి రాజశేకర్ రెడ్డిని ఒక మెట్టు పైకి ఎక్కించారు. శనివారం బెంగుళూరులో యోగి వేమన 600 జయంతి ఉత్సవాలు నిర్వహించిన ఒక సంస్థ వారు వైఎస్సార్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గురునాధ రెడ్డి, నెల్లూరు జిల్లాకి చెందిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనే ముగ్గుర్ని అతిధులుగా ఆహ్వానించారు. వేమన కవికీ ఈ నాయకులకి ఏం సంబంధం ఉందో ఏమో, లేక ఆ నిర్వాహకులు వీరి పార్టీకి చెందిన వారో తెలియదు.
 
విషయమేదయినా స్వామి భజన చేయడం, స్వామి భక్తి ప్రదర్శించడం లక్షణాలుగా ఒకప్పట్లో రాజుల దగ్గర భట్రాజులని ఉండేవాళ్ళు. ఆ జాతికి తగ్గట్లుగా ఈ భట్రాజులు యోగి వేమన, రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ ఒకలాంటి వారే అని ఒక దాఋణమయిన స్టేట్‌మెంట్ ఇచ్చేసి, దాన్ని సమర్ధించుకోవడానికి వివరణ కూడా ఇచ్చారు. ఆనాడు యోగి వేమన సమాజంలో కుళ్ళు కడిగి పారేస్తే, ఈనాడు యోగి రాజన్న సమాజంలో పేదరికాన్ని మాయం చేసిపారేశాడట. అవ్వ!

Friday, March 30, 2012

బూతుని సెన్సార్ చేసినందుకు ఆ దర్శకుడికి కోపమొచ్చింది


విక్రమ్ భట్ నిర్మాతగా, వివేక్ అగ్నిహోత్రి దర్శకుడిగా, బెంగాలీ నటి పయోలీ డామ్ నటిస్తున్న హేట్ స్టోరీ అన్న హిందీ చిత్రం ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తోంది. పయోలీ బెంగాలీ నటి. ఈ అమ్మడు ఇప్పటికే చత్రక్ లాంటి బెంగాలీ సినిమాలలో ఏ మాత్రం సంకోచం లేకుండా బట్టలిప్పేసి వార్తల్లోకెక్కింది. బూతునీ, బూతు తారలనీ ప్రోత్సహించడంలో భట్‌లు ముందుంటారు. మహేష్ భట్, పూజా భట్‌లు సన్నీ లియోన్‌తోజిస్మ్ -2 సినిమా తీస్తూండడం అందరికీ తెలిసిందే.
 
ఈ హేట్ స్టోరీలో కథ మొత్తం సెక్స్ చుట్టూ తిరుగుతుంది. తనకి అన్యాయం చేసిన వ్యక్తుల మీద తన అందాన్ని వాడుకొని ఒక అమ్మాయి ప్రతీకారం తీర్చుకోవడం ఈ సినిమాలో కథ. పయోలీ వీపు మీద ఒక కేప్షన్‌తో పోస్టర్ రిలీజ్ చేసి సినిమా ప్రారంభంలోనే వేడి రగిలించారు దర్శక నిర్మాతలు.http://www.youtube.com/watch?v=4wyAIdYRTPg ఇప్పుడు యూ ట్యూబ్‌లో ఈ సినిమా తాలూకూ ట్రెయిలర్ రిలీజయింది. పయోలీ ఈ సీన్లలో రెచ్చిపోయి నటించింది.
 
అంతే కాక, "నేను ఈ నగరంలో కల్లా పెద్ద లం** కావాలనుకొంటున్నాను", "నన్ను *ఽ%న వాళ్ళని నేను *ఽ%తాను" అని కొన్ని ఆణిముత్యాల్లాంటి డైలాగులు కూడా ఉన్నాయి. ఈ డైలాగులు విని సెన్సారు బోర్డు వీటిని బీప్ చేస్తే కానీ ట్రెయిలర్‌ని అనుమతించమని చెప్పింది. ఇది విక్రమ్ భట్‌కి, వివేక్ అగ్నిహోత్రికీ కోపం తెప్పించింది.
  
"సెన్సారు బోర్డులో ఉండేవాళ్ళందరూ పాతకాలం మనుషులు. ఈ డైలాగులు తీసేస్తే సినిమాలో ఉన్న బోల్డ్ నెస్ అర్ధం కాదు. స్పోర్ట్స్ కారు కొనుక్కుని ట్రాఫిక్‌లో మెల్లగా ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది" అని తమ ఆవేదన వెల్లడించుకుంటున్నారు. అయితే యూట్యూబ్‌లో ఉన్న ట్రెయిలర్ మాత్రం అలాగే ఉంటుందట. అందులో సెన్సారు ఉండదు కదా.
  
అయినా ఆ మాత్రం సెన్సార్ లేకపోతే మీరు పచ్చి బూతు సినిమాలు తీస్తారు కదా వివేక్ భయ్యా?

Tuesday, March 27, 2012

ప్రజలు నిజంగా విశ్వసనీయతకు పట్టం కడుతారా?


రాజకీయ నాయకులకి తరచుగా వాళ్ళూ, వీళ్ళూ ఇచ్చే సలహా విశ్వసనీయత పెంచుకోండి అని. ఇటీవల కాలంలో ఈ సలహా తరచుగా తీసుకున్న నాయకుడు చంద్రబాబు. ఆయన రైతు యాత్రలంటూ నానా యాగీ చేస్తూ ఉంటే ముందు నువ్వు నీ విశ్వసనీయత పెంచుకోవయ్యా అని అందరూ చెప్పేవారే. ఇక యువనేత అయితే చనిపోయిన తన తండ్రి మహానేతని ఉదహరిస్తూ అలా మారి చూపించు ముందు, ఆ తరువాతే ప్రజల్లోకి రా అని తన ఓదార్పు యాత్రలో, సాక్షి పత్రిక చానల్ సాక్షిగా చెప్తూ వచ్చాడు. అయితే ప్రజలు నిజంగా విశ్వసనీయతకు పట్టం కడుతారా అంటే అది సందేహాస్పదమే.
   

మొన్న జరిగిన ఉపఎన్నికలలో తెలంగాణాలో ఆ సెంటిమెంట్ పని చేసిందనుకుంటే, ఏ సెంటిమెంట్ లేని కోస్తాలోని నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజక వర్గంలో కూడా ఉప ఎన్నిక జరిగింది.


ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి 2004 లో గెలిచి 2009లో ఓడిపోయాడు. ఈయన పెద్దగా జనానికి తెలిసిన నాయకుడు కాకపోయినా మొదటిసారి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ అనుకూల వాతావరణంలో గెలిచాడు. అయితే గెలిచాక రెండు చెప్పుకోదగ్గ పనులు చేశాడు. చాలా కాలంగా మూతపడ్డ షుగర్ ఫాక్టరీ తెరిపింఛాడు. పెన్న బ్యారేజీ మంజూరు చేయించి నిర్మాణం జరిపించాడు. అయితే ప్రజల్లో లేకపోవడం వల్ల తరువాతి ఎన్నికలలో ఓడిపోయాడు. పట్టుబట్టి సీటు తెచ్చుకొని ఉపఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు.


2004, 2009, 2012 ఎన్నికలలో తెలుగు దేశం తరఫున పోటీ చేసి 2009,2012 లో గెలిచిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 2009లో గెలిచి సరిగా నెల తిరక్క ముందే   చంద్ర బాబు మీద తిట్ల పురాణం ఎక్కుపెట్టి రాజ శేఖర్ రెడ్డికి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. అయితే ఆయన మరణానంతరం నెలకొన్న పరిస్థితులలో తెలివిగా జగన్ వైపు చేరాడు. ఉప ఎన్నికలో అవలీలగా గెలిచాడు.


ఇక్కడ చూడండి. ఒక పార్టీ తరఫున గెలిచి, ఆ పార్టీ నాయకుడినే తిట్టి, గెలిచిన వెంటనే ప్లేటు ఫిరాయించిన నాయకుడికి ప్రజలు పట్టం కట్టారు. నియోజక వర్గానికి రెండు ముఖ్యమైన పనులు చేసిన నాయకుడిని వరుసగా రెండు సార్లు తిరస్కరించారు. కాబట్టి విశ్వసనీయత పెంచుకోవడం కాదు, అలా నటించాలి అంతే. ప్రజల కోసం బతుకుతున్నట్టు, వారి కోసమే తిరుగుతున్నట్టు అనిపించాలి. అంతే.

Sunday, March 25, 2012

బ్రహ్మ చేత వ్యభిచారం చేయించి బ్రహ్మ రాతని తారుమారు చేసిన ధీశాలి -2


గురువు గారి కుమారుడి పేరు శంకరుడు అని ఆ ఊరిలోనే కూలీ పని చేస్తున్నాడని, కుమార్తె పేరు వసంత సేన అని, దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందనీ తెలుసుకున్నాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే "అన్నయ్యా" అని బావురుమన్నాడు శంకరుడు. పిల్లల దుస్థితి చూసి దుఃఖంతో మంచం పట్టి గురువు దంపతులు మరణించారని తెలుసుకున్నాడు వసంతుడు. చిన్న పూరిపాక, చినిగి పోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎక్కడ చూసినా తాండవిస్తున్న దారిద్ర్యం...ఇదీ శంకరుడి స్థితి. "బాధ పడకు. నేను చెప్పినట్లు చెయ్యి" అని చెప్పాడు వసంతుడు.
  

"ఆవుని తోలుకొని పట్టణానికి వెళ్దాం రా" అన్నాడు వసంతుడు. ఏమీ మాట్లాడకుండా ఆవుని తోలుకొని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. నేరుగా సంతకు వెళ్ళారు ఇద్దరూ. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి "ఆవుని ఎంతకు కొంటావు" అనడిగాడు వసంతుడు. అతను చెప్పిన ధరకు దాన్ని అమ్మేశాడు. శంకరుడికి ఏమీ అర్ధం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవుని అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమయిన సరుకులు, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. "ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు" అని చెప్పాడు. శంకరుడు మారుమాట్లాడకుండా చేశాడు.


"అన్నా ఇంతవరకూ ఆ ఆవు ఉంది కదా అన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు ఆ ఒక్క ఆధారం కూడా లేకుండా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన డబ్బు కూడా అన్నదానానికి ఖర్చయింది. తెల్లవారితే ఎలా గడపాలో భయంగా ఉంది" అన్నాడు శంకరుడు ఆ రాత్రి వసంతుడితో. "ఏమీ ఆలోచించకుండా నిదురపో. పొద్దున్నకల్లా నీ ఆవు నీ ఇంట్లో ఉంటుంది" అని ధైర్యం చెప్పాడు. పొద్దున లేచి తలుపు తెరిచి బయటకు వచ్చిన శంకరుడి ఆశ్చర్యానికి అంతు లేదు. ఇంటి ముందు తన ఆవు ఉంది. శంకరుడి ఆస్థి ఎప్పుడూ ఒక ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి బ్రహ్మే స్వయంగా రాత్రికి రాత్రి ఒక ఆవుని తీసుకొచ్చి అక్కడ కట్టేశాడు. 
   

ఆ రోజు కూడా ఆవుని తీసుకెళ్ళి సంతలో అమ్మి వచ్చిన డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. "ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఇలాగే చేస్తూ ఉండు" అని చెప్పి వసంత సేనని వెతుక్కుంటూ వెళ్ళాడు. అన్ని దానాలలో మిన్నదయిన అన్నదానం క్రమంతప్పకుండా చేస్తున్నందువలన శంకరుడు అమితమయిన పుణ్యం మూట కట్టుకున్నాడు. 


వాళ్లనీ, వీళ్ళనీ అడిగి వసంత సేన ఇల్లు కనుక్కొని వెళ్ళాడు. ఒక అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటోంది ఆమె. వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది వసంత సేన. "అన్నా, నేను పాపిని. పాప పంకిలంలో కూరుకు పోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడ్డానికి కూడా నాకు అర్హత లేదు" అని బావురుమంది. "ఊరుకో. ఇవాళ్టి నుంచీ నేను చెప్పినట్లు చేయి" అని ఆమెని ఓదార్చాడు వసంతుడు. ఆ రాత్రికి విటులు ఎవరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని ఆమె దగ్గర ఉన్న అవ్వతో చెప్పడు. ఆమె ఆశ్చర్యపోయింది. "అయ్యా, ఇది జరిగే వ్యవహారం కాదు" అని ఏదో చెప్పబోయింది. "నేను చెప్పినట్లు చెయ్యి?" అన్నాడు వసంతుడు.
  

ఆ రాత్రి ఇద్దరు ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. అర్ధ రాత్రి సమీపిస్తున్నదనగా ఒక పురుషుడు లక్ష వరహాలతో వచ్చాడు. ఆ రాత్రి వసంత సేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటి రాత్రి కూడ అలానే జరిగింది. తన రాత తప్పకూడదని లక్ష వరహాలు ఇచ్చి వసంత సేనతో సంభోగించింది సాక్షాత్తూ బ్రహ్మే అని వసంతుడికి తెలుసు. బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకూ ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటపంచలయిపోయాయి.