నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, June 24, 2012

నాగర్ హోళె నేషనల్ పార్క్‌లో మా జంగిల్ సఫారీ-కొన్ని ఫోటోలు-1


ఈ ఏప్రిల్ నెల చివరిలో కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఒక రోజు నాగర్ హోళె నేషనల్ పార్క్‌లో ఉండేలా ప్లాన్ చేశాను పిల్లలకి అసలైన అరణ్యం ఎలా ఉంటుందో చూపించాలని. మేము కూర్గ్ నుంచి వెళ్ళేసరికి మద్ఝ్యాహ్నమయింది. ఆరోజు సాయంత్రం జంగిల్ సఫారీకి వెళ్ళే మూడు వాహనాలు అప్పటికే బుక్కయిపోయాయి. మా డిజప్పాయింట్‌మెంట్‌ని చూసిన అక్కడి గైడ్ "మరేం ఫర్లేదు సర్. అసలు జంతువులని చూడ్డానికి వేకువ జాము సరయిన సమయం. రేప్పొద్దున ఆరు గంటలకి జీప్ బుక్ చేసుకోండి. కావాలంటే ఇప్పుడు మీ టాక్సీలో మా జీప్ వెనకాలే రండి. అడవిలోకి వెళ్ళోచ్చు. వచ్చేటప్పుడు అక్కడ చెక్‌పోస్టులో అయిదు వందలు ఇస్తే సరి" అని చెప్పడంతో మేం మాటాక్సీలో బయలు దేరాం.


కర్ణాటక, తమిళ నాడు, కేరళల్లో విస్తరించి ఉన్న మహారణ్యం అది. కర్ణాటకలో రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని పేరు పెట్టినా అందరూ నాగర్ హోళె అనే పిలుస్తారు. కేరళలో ఉన్న భాగాన్ని పెరియార్ నేషనల్ పార్క్ అంటారు. తమిళ నాడులో ఉన్న భాగంలోనే ఒకప్పుడు వీరప్పన్ వీర విహారం చేశాడు. దీనిని ముదుమలై నేషనల్ పార్క్ అంటారు.


మొదటి రోజు ఒక నీటి గుంట దగార దాహం తీర్చుకొంటున్న ఒక ఏనుగు, జింకలు, కొన్ని పక్షులు, అడవి కోళ్ళు, రోడ్డు దాటి తమ నివాసానికి వెళ్తున్న ఏనుగులు కనిపించాయి. అయితే తిరిగి వచ్చే సమయంలో రోడ్డు అంచు దాకా వచ్చిన ఒక గజ రాజు తొండం పైకెత్తి చెట్ల ఆకులు తుంచుకొని తింటూ చాలా సేపు మాకు, మా కెమెరాలకీ కను విందు చేసింది.


నీటి మడుగు దగ్గర దాహం తీర్చుకొంటున్న ఏనుగు. అది చాలా చిన్నగా ఉన్నందువల్ల ఫోటోని క్రాప్ చేసి మార్క్ చేశాను.


అడవి కోడి.



రోడ్డు దాటుతున్న ఏనుగుల మంద. మేం తిరిగి వస్తున్నపుడు మా వాహనం వెనకాల ఇవి ఉండడంతో అన్నీ దాటి వెళ్ళక గానీ మేం గమనించలేదు. మేము చూసినప్పుడు రెండే ఉన్నాయి. 





లాంగూర్ అని పిలవబడే ఒక కోతి. కొండ ముచ్చు అంటారు తెలుగులో. 


ఒక జింకల కుటుంబం.







మాకోసమే అన్నట్టు రోడ్డు అంచుదాకా వచ్చి విన్యాసాలు చేస్తున్న గజరాజు.







సఫారీ నుంచి తిరిగి వచ్చాక డిన్నర్ సమయంలో ట్రైబల్ డాన్స్ అరేంజ్ చేశారు రిసార్టు వాళ్ళు. ఉత్సాహం ఉన్న కొందరు గెస్టులు కూడా వారితో కలిసి చిందేశారు.

పక్కరోజు ఉదయం మాకు కనిపించిన నాగర్ హోళె అందాల గురించి మరో పోస్టు రాస్తాను.

Friday, June 1, 2012

ప్రపంచ వేశ్యా దినం


డాక్టర్ల దినం, ఉపాధ్యాయుల దినం, ఇంజనీర్ల దినం...ఇలా ప్రతి వృత్తిలో ఉండే వారికీ ఒక రోజు ఉంది. అయితే ప్రపంచంలో అతి ప్రాచీన వృత్తిలో ఉన్న వారికి కూడా ఇలా ఇక దినం ఉందా అంటే ఉంది. ప్రతి ఏటా జూన్ రెండవ తేధీని ప్రపంచ వేశ్యా దినంగా జరుపుకుంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినంగా, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్ల దినంగా, డాక్టర్ బీసీ రాయ్ జయంతిని డాక్టర్స్ డే గా జరుపుకుంటారు. మరి ఏ వేశ్య మాత జయంతిని ఇలా వేశ్యా దినంగా జరుపుకుంటారు అని అనుమానం వస్తే అది ఎవరిదో జయంతి కాదు. ఈ దినం వెనుక ఒక కథ ఉంది.
 
జూన్ 2, 1975. ఫ్రాన్స్ లోని ల్యోన్ నగరంలో ఉండే వేశ్యలందరూ నిరసన గళం ఎత్తారు. నగరంలోని చర్చిలో గుమి కూడి తమ నిరసన వ్యక్తం చేశారు. తమని పోలీసులు అన్యాయంగా వేధిస్తుంటారని, తమ తప్పు లేక పోయినా కెసులు బనాయించి, జరిమానాలు వసూలు చేస్తుంటారని వారి ఆవేదన. అయితే పోలీసులు దీన్ని లైట్‌గా తీసుకోలేదు. ఒక గంటలోగా చర్చిని ఖాళీ చేయకపోతే మీ పిల్లలని మీనుంచి లాగేస్తాం అని అల్టిమేటమ్ ఇచ్చారు. క్షణాల్లో ఈ విషయం నగరమంతా పాకి పోయింది. వేశ్యలైనా వీళ్ళూ ఆడవాళ్ళే కదా అని ఊరిలోని ఆడవాళ్ళు చాలా మంది వచ్చి వారికి సంఘీభావం తెలుపుతూ వారితో కలిసి పోయారు. అప్పుడు వేశ్యలెవరో, మామూలు ఆడవాళ్ళెవరో ఎవరూ చెప్పలేని పరిస్థితి. పోలీసులు దిగిరాక తప్పలేదు. వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించి వారిని శాంతింపచేశారు. ఈ సంఘటనని పురస్కరించుకొని అప్పటినుంచి ప్రతి యేటా జూన్ రెండున ప్రపంచ వేశ్యా దినంగా జరుపుకుంటారు.
 
వీరికి ఒక అంతర్జాతీయ సంఘం కూడా ఉంది. దాని పేరు Scarlet Alliance. ఎలెనా జెఫ్రీస్ అనే అమ్మడు దీనికి అధ్యక్షురాలు. తమ పట్ల వివక్షత రూపుమాపడానికి తీవ్రంగా కృషి చేస్తున్నదీమె. బ్యాంకులు తమకి లోన్లు ఇవ్వడానికి, వెనుకాడుతాయని, ఒక వేళ ఇచ్చినా అధిక వడ్డీ వసూలు చేస్తాయని ఈమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక ఆస్ట్రేలియాలోని, న్యూ సౌత్ వేల్స్‌లోని ఐవీ మెకింటోష్ మరొక రకమైన బాధని వ్యక్తం చేస్తుంది. ఆ రాష్ట్రంలో వ్యభిచారం చట్ట బద్ధం. "వార్తా పత్రికలలో పది డాలర్ల ప్రకటన నేను నా వృత్తి కోసం ఇవ్వాలనుకుంటే వంద డాలర్లు వసూలు చేస్తారు" అని అంటుంది ఈమె. "అన్ని వృత్తుల్లాగే ఇదీ ఒక వృత్తే. మేమూ అందరిలాగే అన్ని పన్నులు చెల్లిస్తాం. మా పట్ల వవక్షత ఎందుకు?" అన్నది వీళ్ల ప్రశ్న. 

తన వేగమే తనకు రక్ష (కనీసం ఆనంద్ విషయంలో ఇది నిజం)


ఈ మాట కొత్తగా బైక్ కొన్న కుర్ర వాడితో చెప్తే వాడి తల్లో తండ్రో చెప్పుచ్చుక్కొట్టడం ఖాయం. అయితే చదరంగపు విశ్వ విజేత విశ్వనాధన్ ఆనంద్‌ని ఆ వేగమే గెలిపించింది. రెగ్యులర్ ఫార్మాట్‌లో జరిగిన పన్నెండు గేములూ సరి సమానంగా ముగిశాయి. ఆనంద్‌కి ఏ విషయంలోనూ తీసిపోకుండా జవాబిచ్చాడు గెల్ఫాండ్. ఇక రాపిడ్ గేములు మొదలయ్యాక ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ఒక రాంగ్ మూవ్ వేసినా ఓడిపోయే గేమ్‌లు అవి. ఈ పద్ధతిలో గేమ్ ప్రారంభంలో ఇద్దరికి 25 నిముషాలు టైమ్ ఉంటుంది. ఒక్కో ఎత్తు వేసేకొద్దీ పది సెకన్లు కలుస్తూ ఉంటుంది. 
 
మొదటి గేమ్‌లో ఇద్దరూ విజయం కోసం తీవ్రంగా పోరాడినా ఒక దశలో ఇద్దరికీ సమయం తక్కువగా ఉండడంతో ఇద్దరూ డ్రా దిశగానే ఆడారు. ఇక రెండవ గేమ్‌లో ఒక దశలో గెల్ఫాండ్ బాగా ఆధిక్యం సాధించినా గెలుపుకి అవసరమయిన వ్యూహం ఎంచుకోవడానికి తగిన సమయం లేక పోయింది. ఇక ఆ గేమ్ చివరి దశలో ఇద్దరికీ సమానంగా ఉన్న దశలో గెల్ఫాండ్‌కి ఎత్తు వేయడానికి రెండు సెకన్లే మిగిలి ఉంది. ఒక ఎత్తు వేస్తే పది సెకన్లు కలుస్తాయి అనుకున్న గెల్ఫాండ్ వేసిన తొందరపాటు ఎత్తు అతన్ని పరాజయం పాలు చేసింది.


వెను వెంటనే జరిగిన మూడవ గేమ్‌లోనూ ఇదే పరిస్థితి. ఆధిక్యంలో ఉన్నప్పుడు సమయాభావం వల్ల ఆ ఆధిక్యాన్ని విజయంగా మలుచుకొలేక డ్రాతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అలా అన్ని విధాలుగా ఆనంద్‌తో సమ ఉజ్జీగా నిలిచినా ఆటలో వేగంలో ఆనంద్‌తో పోటీ పడలేకపోయాడు బోరిస్ గెల్ఫాండ్.


చిన్నప్పటి నుంచీ ఏ విధమయిన గేమ్‌లో అయినా చకచకా ఎత్తులు వేస్తూ "లైట్నింగ్ కిడ్" అని పేరు తెచ్చుకున్న ఆనంద్‌ని ఆ మెరుపు వేగమే ఈ సారి చాంపియన్‌ని చేసింది.



Kamikaze పద్ధతిలో జగన్‌తో పోరాడుతున్న కాంగ్రెస్


Kamikaze అన్నది రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో జపాన్ వైమానిక దళం అమెరికన్ యుద్ధ నౌకలపైన పోరాటంలో అనుసరించిన విధానం. ఇందులో నౌకలమీద బాంబులో, క్షిపణులో ప్రయోగించడం ఉండదు. కొంత మందు గుండునో, లేకుంటే టాంకు నిండా ఇంధనంతోనో విమానం నేరుగా వెళ్ళి నౌకని ఢీకొంటుంది. పెద్ద శబ్ధంతో రెండూ పేలిపోతాయి. జపాన్ వారికి పోయేది ఒక విమానం, అందులో ఉన్న ఇద్దరు సిబ్బంది అంతే. కానీ ఎదుటి వైపున ఒక యుద్ధ నౌక, దాని మీద ఉన్న విమానాలు, చాలా మంది నావికులు, ఇతర సిబ్బంది పోతారు. యుద్ధం చివరి దశకి వచ్చే సరికి జపాన్ పుర్తిగా దెబ్బ తినిపోయింది. దాని కర్మాగారాలన్నీ శత్రువుల దాడుల్లో నాశనమైపోయాయి. చాలా మంది సుశిక్షితులైన పైలట్లు యుద్ధంలో మరణించారు. ఆర్ధికంగా దేశం కోలుకోలేని విధంగా తయారయింది. విమానాలకి బాంబులు, క్షిపణులూ అందించే స్థితిలో జపాన్ లేదు. అలాగని లొంగిపోవడానికి ఇష్టం లేదు. ఆటువంటి స్థితిలో వాళ్ళు అనుసరించిన వ్యూహం Kamikaze. తమ వైపు నుంచి తక్కువ నష్టంతో ప్రత్యర్ధికి ఎక్కువ నష్టం కలిగించే వ్యూహం అది. అయితే ఇది పరాజయం అంచులో ఉన్న వారు ఎన్నుకొనే పద్ధతి.
  
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా జగన్‌తో పోరాటంలో ఇదే వ్యూహం అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. జగన్‌ని జైలులో పెట్టడం స్ట్రాటజిక్‌గా వారికి లాభించే విషయమే కానీ, జగన్ తల్లి విజయమ్మపైన కూడా దాడి చేయడం, మాటల తూటాలు సంధించడం ప్రజల్లో ఒకరకమైన నెగటివ్ ఫీలింగ్ పుట్టించే ప్రమాదం ఉంది. ఎండలో, పోలింగ్ బూత్ ముందు క్యూలో నించుని ఓటు వేసే వాళ్ళు ఆర్ధిక నేరాలు సంఘానికి, దేశానికి చేసే నష్టం గురించి, జగన్ ఉల్లంఘించిన చట్టాల గురించి పట్టించుకోరు. వారికి విజయమ్మ కార్చే కన్నీళ్ళు, నా బిడ్డకి వీళ్ళు అన్యాయం చేస్తున్నారు అని చెప్పే మాటలే కనిపిస్తాయి. కాబట్టి కాంగ్రెస్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే వీపులు చిట్లిపోతాయి.


ఆమె చేతులు జోడించి నించుంటే చాలు.


జగన్ పార్టీలో ఒక లెవెల్లో ఉన్న నాయకుడు నా మిత్రుడు. 2014 ఎన్నికలలో ఒక అసెంబ్లీ నియోజక వర్గానికి కేండిడేట్‌గా పోటీలో ఉన్నాడు. "జగన్ మొదట్లో ప్రతి మాటనీ, పాటలాగా సాగ దీసి పాడినా తరువాత్తరువాత బాగా లాక్కొచ్చాడు. ఈ విజయమ్మ గట్టిగా రెండు వాక్యాలు కూడా స్పాంటేనియస్‌గా మాట్లాడలేకపోతుంది. ఈమె కేంపయిన్‌తో మీకు లాభమెలా వస్తుంది" అన్నాను అతనితో. 
 
"ఆమె ఎక్స్‌టెంపోర్ స్పీచ్‌లు ఇచ్చి ప్రజల్ని మేల్కొలపాల్సిన అవసరం లేదు. జనం మధ్య నించుని చేతులు జోడిస్తే చాలు. మాకు కావలసిన ఓట్లు మాకు పడిపోతాయి" అన్నాడు అతను.


నిజమే కదా!