నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, August 19, 2012

వైఎస్సార్ మరణం చంద్రబాబు నాయుడిని దెబ్బ కొట్టిందా?


రాజ శేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత చంద్రబాబు నాయుడు బలపడతాడని ఎవరైనా అనుకుంటే అది తప్పని తేలిపోయింది. జగన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అసమ్మతి రాజకీయాలు నడుపుతూ ఉండి ఉంటే ఎలా ఉండేదో గానీ బయటకి వచ్చి స్వంత పార్టీ పెట్టాక తెలుగు దేశం మరింత బలహీనపడి కొన్ని చోట్ల మూడవ స్థానానికి పడి పోయింది. రాజ శేఖర్ రెడ్డి బతికి ఉంటే ఇప్పటికి తెలుగుదేశం బలపడి 2014 ఎన్నికలనాటికి విజయం వైపు అడుగులు వేస్తూ ఉండేదేమో.
 
2009 ఎన్నికలలో వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బొటాబొటీ మెజరిటీతో గట్టెక్కింది. మరొక అయిదేళ్ళు అధికారంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత మరింత బలపడి 2014 ఎన్నికల నాటికి అది కాంగ్రెస్‌ని దెబ్బతీసే స్థాయికి చేరుకొని ఉండేది. 

కానీ అనూహ్యంగా రాజ శేఖర్ రెడ్డి ప్రమాదంలో మరణించడం, ఆ సానుభూతి జగన్‌కి లాభించడం, వెరసి టీడీపీకి నష్టదాయకంగా మారింది. అంచేతనే తెలుగు తమ్ముళ్ళు ఒకరొకరుగా జగన్ బాట పడుతున్నారు. చంద్రబాబుకి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్ధ్యం లేదనుకుంటే, మరెవరికీ అంత సీన్ లేదు. బాలకృష్ణకి గానీ, హరికృష్ణ అండ్ సన్‌కి గానీ రాష్ట్రమంతా తిరిగి ఓట్లని సంపాదించే కెపాసిటీ లేదు.

2 comments:

Anonymous said...

yes 100% correct

♛ ప్రిన్స్ ♛ said...

J NTR Parti Adhyakshudu Aite Eemanna maaraa vachu Leka Pote TDP Charitralo Kalisipotadi-- Na Abhiprayamu Matrame