నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, August 29, 2010

రాష్ట్రంలో ఇన్నాళ్ళకి ఒక పద్ధతికి వచ్చిన రాజకీయ వ్యవస్థ

ఒక సంవత్సర కాలం ముందు వరకూ ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయం చాలా అస్తవ్యస్తంగా అన్యాయంగా అవతతవకలుగా నానా కంగాళీగా ఉండేది. ప్రధాన ప్రతిపక్షం అదికార పక్షం మీద పోరాటం చేయడం మాట అటుంచి తనకున్న ఎమ్మెల్యేలే అటువైపు పోకుండా వాళ్ళని కాపలా కాసుకోవడానికే పూర్తి సమయం కేటాయించాల్సివచ్చింది. మరో ప్రతి పక్షం అయిన ప్రజా రాజ్యం తమ పోరాటం ఎవరితో చేయాలో తెలియక, ఏదో క్షణంలో అధికార పార్టీ నుండి ఆహ్వానం అందక పోతుందా అందిన మరు క్షణం అందులో విలీనం కాక పోతామా అని వేచి చూస్తూ అప్పుడప్పుడూ రాజకీయాల్లో ఉన్నాం అందులోనూ ఆపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఎవరో ఒకర్ని విమర్శించాలి కాబట్టి తెలుదేశమోళ్ళని తిట్టి పోస్తూ ఉండేవాళ్ళు. ఇక కమ్యూనిస్టుల గురించి పురావస్తు శాఖ వాళ్ళు అప్పుడప్పుడూ శిధిలాల కింద చూడ్డం తప్పించి వాళ్ళని మిగతా వాళ్ళందరూ మర్చి పోయారు. తెలంగాణా కేసీఆర్ తన కారుని ప్రీ ఓన్డ్ కారులు అమ్మే వాళ్ళకి అమ్మకానికి పెట్టి ఇంట్లో కూర్చుని తలుపులు బిడాయించుకొని ప్రజల దృష్టి లోంచి పూర్తిగా చెరిగి పోయాడు.
అన్నింటి కన్నా అన్యాయం కాంగ్రెస్ లో ఉండే ఆపోజిషన్ ది. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి వాదులకు స్వంత పార్టినీ దాన్ని నడిపే నయకులనీ దుమ్మెత్తి పోయడం అన్నది జన్మ హక్కు. అది కూడా లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో కొమ్ములు మొలిచి, తోకలు పొడవైన జానా రెడ్డీ, దివాకర్ రెడ్డిలకు ఈసారి మంత్రి పదవి దక్కక పోయినా ఒక్క మాట అనేదానికీ లేకుండా పోయిందంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.
రాజశేఖర్ రెడ్డి మరణంతో ఒక్కసారిగా అంతా మారి పోయింది. పార్టీ సుప్రీమ్ సోనియా గాంధీ ఈ మార్పుకి శ్రీకారం చుట్టింది. రోశయ్యని ముఖ్యమంత్రి చేయడంతో ఈ మార్పు మొదలయ్యింది. రోశయ్య 100 మీటర్ల స్ప్రింట్ లో పరుగెత్తే వాడిలాగా ఒక కాలు కుర్చీలో ఇంకో కాలు కిందా పెట్టి ఎప్పుడు దిగమంటే అప్పుడు దిగేస్తాను అని కూర్చోవడం, ఇంకో పక్క జగన్ నేను జనాన్ని ఓదార్చాల్సిందే అని రాష్ట్రమంతా తిరిగేయడం, కాంగ్రెస్ లోని ముసలీ ముతకా లీడర్లు బయటకి వచ్చి మేమింకా బతికే ఉన్నమంటూ టీవీ కెమెరాల ముందుకి రావడంతో అలికిడి మొదలైంది.

చంద్ర బాబు ఒక్కసారిగా ఊపు తెచ్చుకొన్నాడు. కేసీఆర్ ఒక దీక్షతో చచ్చిన వాడికి అమృతం పోసినట్టు లేచికూర్చున్నాడు. దానికి తోడు కేంద్రం శ్రీకృష్ణ కమిటీ ఒకటి వేయడంతో ఈ ప్రక్రియ వేగవంతమయ్యింది. చివరికి చిరంజీవి కూడా నాకేం తక్కువ అని హుంకరించడం, ప్లీనరీలు పెట్టడం చేయసాగాడు. ఇప్పుడు మజా వచ్చింది AP రాజకీయాల్లో.

కాంగ్రెసోళ్ళు కాంగ్రెసోళ్ళని తిడుతూ ఉన్నారు. కేసీఆర్ పులయి పోయాడు. వచ్చే ఎన్నికలు తరువాత అధికారం తనదే అని చంద్రబాబు ధీమాగా ఉన్నాడు. చిరంజీవి ఉప ముఖ్యమంత్రి అయిపోదామని కలలు కంటున్నాడు.

రాజాశేఖరా చచ్చి ఎంతపని చేశావు స్వామీ!


3 comments:

gajula said...

chesedhevadu ,cheyinchedevadu anthaa aa paivaadu(10janapath?)

Anonymous said...

నకు చెప్పలెనంథ నవ్వు తెప్పించిన మీకు ధన్యవదాలు

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thanks Anonymous for the kind compliment.